BRS Boycott Assembly: రేపు అసెంబ్లీని బహిష్కరించిన బీఆర్ఎస్.. సీఎంపై హరీష్ రావు ఫైర్
- రేపు అసెంబ్లీని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం..
- అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతల ఆందోళన..
- అసెంబ్లీని ముఖ్యమంత్రి రేవంత్ బూతులమయం చేసేశాడు..
- సభను ఏకపక్షంగా నడిపిస్తున్నారు.. అందుకే వాకౌట్ చేశాం: హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Boycott Assembly: రేపటి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపటి సభకు హాజరు కావొద్దని పేర్కొన్నారు. రేపు ఉదయం తెలంగాణ భవన్ లో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.
Read Also: Iran: ఖమేనీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు.. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి
Also Read
- Telangana Heatwave : తెలంగాణను వణికిస్తున్న భానుడు.. మరో మూడు రోజులు ఇంతే.!
- KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- Terrorist Arrest: మేడ్చల్లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
ఈ సందర్భంగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గన్ పార్క్ దగ్గర నిరసన తెలియజేశారు. ఇక, మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య రీతిలో దిగి వస్తూ శాసనసభ నిబంధనలు లేకుండా సభను నడుపుతున్నారని ఆరోపించారు. బీఏసీలో మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు వేరు అసెంబ్లీలో పెట్టినవి వేరు.. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు పెట్టకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మూసీకి సంబంధించి కొన్ని ప్రశ్నలను సభలో సందించాం.. వాటిపై సమాధానాలు ఇవ్వకుండా సీఎం మాట్లాడుతున్నారు.. అసెంబ్లీని సీఎం బూతులమయం చేశాడని ఎద్దేవా చేశారు. ఇలా మాట్లాడిన స్పీకర్ ఆయనకి అడ్డు చెప్పలేదు.. బీఆర్ఎస్ కి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఇక సభకు ఎందుకు రావాలని హరీష్ రావు ప్రశ్నించారు.
అయితే, రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రధానమంత్రి మీద మాట్లాడటం లేదా అని హరీష్ రావు అడిగారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత మాకు ఉంది.. మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు సభలో ఎక్కువైంది.. ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాల్సి ఉంది.. గాంధీభవన్ లో మాట్లాడే సొల్లు అసెంబ్లీలో మాట్లాడతారా అని ప్రశ్నించారు. దీని కోసమైనా అసెంబ్లీ పెట్టడం.. మల్లన్న సాగర్ నుంచే కాళేశ్వరం ప్రాజెక్టులోకి నీరు తెస్తున్నారా అని అడిగాం.. మూసీ ప్రక్షాళనకు నడుము బిగించిందే బీఆర్ఎస్.. బాడీ షేమింగ్ కు ముఖ్యమంత్రి పాల్పడుతున్నారు.. రౌడీషీటర్స్ ఇంకా మంచిగా మాట్లాడుతారని హరీష్ రావు అన్నారు.
Read Also: Dhurandhar: ఒకే రోజులో ఐదు రికార్డ్లు బ్రేక్ చేసిన ‘ధురంధర్’..
ఇక, కేసీఆర్ పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. మైక్ ఇవ్వకుండా శాసనసభలో కూర్చోవడం వెస్ట్.. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తుంది.. సభలో అందరికీ సమాన హక్కులు ఉండాలి.. సీఎం అడ్డగోలుగా మాట్లాడితే స్పీకర్ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
-
Shiva Rajkumar: రామ్చరణ్కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై కన్నడ సూపర్ స్టార్ శివన్న సంచలన వ్యాఖ్యలు!
-
Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
-
Ram Charan : రామ్ చరణ్ తన బాడీగార్డ్కు రోజుకు ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
-
Venkatesh Iyer: సడన్గా వెంకటేశ్ అయ్యర్కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో కోహ్లీతో ఓపెనర్గా రంగంలోకి..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?