BRS Boycott Assembly: రేపు అసెంబ్లీని బహిష్కరించిన బీఆర్ఎస్.. సీఎంపై హరీష్ రావు ఫైర్
- రేపు అసెంబ్లీని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం..
- అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతల ఆందోళన..
- అసెంబ్లీని ముఖ్యమంత్రి రేవంత్ బూతులమయం చేసేశాడు..
- సభను ఏకపక్షంగా నడిపిస్తున్నారు.. అందుకే వాకౌట్ చేశాం: హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Boycott Assembly: రేపటి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపటి సభకు హాజరు కావొద్దని పేర్కొన్నారు. రేపు ఉదయం తెలంగాణ భవన్ లో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.
Read Also: Iran: ఖమేనీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు.. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి
Also Read
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడి అరెస్ట్..
- NEET Re Exam : విద్యార్థులకు గుడ్న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Rythu Bharosa: రైతులకు తీపి కబురు.. రైతు భరోసా డబ్బులు పడేది ఆరోజే..
- Hyderabad: ఫ్రీజర్లో పురుగులు, స్టోరేజ్లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
ఈ సందర్భంగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గన్ పార్క్ దగ్గర నిరసన తెలియజేశారు. ఇక, మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య రీతిలో దిగి వస్తూ శాసనసభ నిబంధనలు లేకుండా సభను నడుపుతున్నారని ఆరోపించారు. బీఏసీలో మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు వేరు అసెంబ్లీలో పెట్టినవి వేరు.. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు పెట్టకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మూసీకి సంబంధించి కొన్ని ప్రశ్నలను సభలో సందించాం.. వాటిపై సమాధానాలు ఇవ్వకుండా సీఎం మాట్లాడుతున్నారు.. అసెంబ్లీని సీఎం బూతులమయం చేశాడని ఎద్దేవా చేశారు. ఇలా మాట్లాడిన స్పీకర్ ఆయనకి అడ్డు చెప్పలేదు.. బీఆర్ఎస్ కి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఇక సభకు ఎందుకు రావాలని హరీష్ రావు ప్రశ్నించారు.
అయితే, రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రధానమంత్రి మీద మాట్లాడటం లేదా అని హరీష్ రావు అడిగారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత మాకు ఉంది.. మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు సభలో ఎక్కువైంది.. ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాల్సి ఉంది.. గాంధీభవన్ లో మాట్లాడే సొల్లు అసెంబ్లీలో మాట్లాడతారా అని ప్రశ్నించారు. దీని కోసమైనా అసెంబ్లీ పెట్టడం.. మల్లన్న సాగర్ నుంచే కాళేశ్వరం ప్రాజెక్టులోకి నీరు తెస్తున్నారా అని అడిగాం.. మూసీ ప్రక్షాళనకు నడుము బిగించిందే బీఆర్ఎస్.. బాడీ షేమింగ్ కు ముఖ్యమంత్రి పాల్పడుతున్నారు.. రౌడీషీటర్స్ ఇంకా మంచిగా మాట్లాడుతారని హరీష్ రావు అన్నారు.
Read Also: Dhurandhar: ఒకే రోజులో ఐదు రికార్డ్లు బ్రేక్ చేసిన ‘ధురంధర్’..
ఇక, కేసీఆర్ పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. మైక్ ఇవ్వకుండా శాసనసభలో కూర్చోవడం వెస్ట్.. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తుంది.. సభలో అందరికీ సమాన హక్కులు ఉండాలి.. సీఎం అడ్డగోలుగా మాట్లాడితే స్పీకర్ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. మంటల్లో రాజధాని మాస్కో..
-
Modi-Trump: జీ7 వేదికగా మోడీతో దిగిన ఆసక్తికర ఫొటో షేర్ చేసిన ట్రంప్
-
Vaibhav Sooryavanshi: సచిన్ తర్వాత మరో యువ సంచలనం.. వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు
-
Jamun-El Niño: విరగకాసిన ‘‘నేరేడు పండ్లు’’, ఈ ఏడాది వర్షాలు అనుమానమే.. అసలేంటీ ఈ సంబంధం..
-
Empty Medicine Packets Reuse: ఖాళీ టాబ్లెట్ స్ట్రిప్స్తో ఎన్నో లాభాలు.. ఈ విషయం తెలిస్తే పొరపాటున కూడా చెత్తబుట్టలో వేయరు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!