Botsa Satyanarayana: ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలి..
- చోడవరంలో షుగర్ ఫ్యాక్టరీ రైతులతో వైసీపీ నేతలు సమావేశం..
- షూగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం నిరసన దీక్ష చేస్తామని వెల్లడి..
- షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది: బొత్స
Botsa Satyanarayana: అనకాపల్లి జిల్లాలోని చోడవరంలో గల షుగర్ ఫ్యాక్టరీ రైతులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చెరుకు రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు, కరణం ధర్మశ్రీ, అదీప్ రాజ్. ఇక, వైఎస్ఆర్సీపీ నేతల ముందు తమ కష్టాలను రైతులు వినిపించారు. కాగా, మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం వైఎస్సార్ సీపీ నిరసన దీక్ష చేస్తామన్నారు. శాసన మండలలో రైతుల సమస్యలను లేవనెత్తుతాం.. రైతుల బకాయిలను ఆణా పైసాతో సహా చెల్లించాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేశారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో లక్ష 70 వేల టన్నుల చెరకు పండింది.. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరకు కూడా క్రస్సింగ్ చేయలేదు అని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని బొత్స అన్నారు.
Read Also: Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళి కస్టడీ పిటిషన్ డిస్మిస్
Also Read
అయితే, ఇప్పటి వరకు రైతులకు బకాయిలు చెల్లించలేదు అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో క్రసింగ్ జరిగేది.. కానీ, ఇప్పుడు సంక్రాంతి దాటిన క్రసింగ్ జరగలేదన్నారు. జనవరిలో క్రాసింగ్ జరగడం వలన చెరుకు ఎండిపోతుంది.. షుగర్ ఫ్యాక్టరీ రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో 90 కోట్ల రూపాయలతో ఆదుకున్నారు.. షుగర్ ఫ్యాక్టరీ కష్టాల నుంచి తక్షణం గట్టెక్కాలంటే రూ. 35 కోట్లు అవసరం అని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వెంటనే 35 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాలి.. టన్ను చెరుకుకు 2500 ఇస్తే ఏమి సరిపోతుంది.. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలి.. రాజకీయాల కోసం నేను రాలేదు.. రైతుల బాధలు చూసి మాట్లాడుతున్నాను అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
-
ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!