CM Chandrababu: అచ్యుతాపురం ఘటన.. హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు
- అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై హై లెవల్ విచారణ కమిటీ..
- ఫార్మా కంపెనీ ప్రమాదంపై జిల్లా అధికారులు.. మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
- హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేశాం..
- నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవు..
- బాధ్యులైన అందరిపైనా చర్యలు వుంటాయి..
- అధికారులు ఆలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసిన ఏపీ సీఎం..
CM Chandrababu: అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేశాం.. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవు.. బాధ్యులైన అందరిపైనా చర్యలు వుంటాయి.. అధికారులు ఆలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.. ఇక, నష్ట పరిహారం మొత్తం కంపెనీ భరిస్తుందన్న ఆయన.. యాజమాన్యం ఇప్పటి వరకు అందుబాటులో లేకుండా పోయింది.. పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.. కానీ, అంత కంటే ముందు భద్రత చాలా అవసరం అన్నారు.. ఐదేళ్లలో 119 ప్రమాదాలు జరిగితే 120 మంది చనిపోయారు.. ఎంఫోర్మెంట్ ఏజెన్సీలు అన్నీ మూకుమ్మడిగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. నివేదికలు అన్ లైన్ లో అప్ లోడ్ చేయాలి… వాటిని మళ్ళీ ర్యాండం గా ఆడిట్ చేస్తాం.. ప్రమాదాలు పునరావృతం కాకుండా పూర్తి బాధ్యత పరిశ్రమల యాజమాన్యాలదే అన్నారు.
Read Also: Mobile Salon: అదిరిందయ్యా ఐడియా.. ఒక్క ఫోన్ తో ఇంటి వద్దకే సెలూన్!.. వీడియో వైరల్
Also Read
రెడ్ జోన్ పరిశ్రమల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. ప్రమాదాలను వీలైనంత వరకు తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలన్నారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేసి తుడుచుకో మనే పరిస్థితి ఇటీవల రాష్ట్రంలో ఉందన్నారు.. వారసత్వంగా వచ్చిన లేగసి సమస్యనా.. లేక పరిశ్రమలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అనే అనుమానం ఉంది.. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తాం అన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు సేఫ్టీ విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాలి.. గత ఐదేళ్లు పరిశ్రమలను లూట్ చేశారు.. ఆ కారణం గానే ప్రమాదాలు ఎక్కువయ్యాయి.. వారసత్వంగా వచ్చిన లేగసీ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు కనిపిస్తోందన్నారు.
మాకు 93శాతం స్ట్రయిక్ రేట్ ఇవ్వడం వెనుక ప్రజలు, యువకులకు చాల ఆశలు వున్నాయి అన్నారు సీఎం చంద్రబాబు.. ఆ దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.. అచ్యుతాపురంలో వాయు కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం అన్నారు.. అచ్యుతాపురం ప్రమాదంలో 17 మంది చనిపోయారు. హృదయ విదారకంగా సంఘటనలు జరిగాయి.. అన్నారు.. చనిపోయిన వాళ్లకు ఆర్థిక సహాయం కింద చెక్కులు ఇవాళే పంపిణీ చేయమని అదేశించామన్నారు.. ఇక, వేపర్ క్లౌడ్ ఎక్స్ ప్లోజన్ కారణంగా ప్రమాదం జరిగింది… SOP ఫాలో అవ్వలేదని స్పష్టంగా అర్ధం అవుతుందన్నారు. ఇప్పటి వరకు 119 ప్రమాదాలు జరిగే 120మంది చనిపోయారు.. LG పాలిమర్స్ ప్రమాదకర వాయువు.. ఇప్పుడు జరిగింది అధికంగా పేలుడు స్వభావం కలిగింది.. అందుకే భారీ నష్టం జరిగింది… LG పాలి మర్స్ ప్రమాదంపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసిన కఠిన చర్యలు అమలు చేయలేదని విమర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!