CM Chandrababu: అచ్యుతాపురం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి.. గాయపడ్డవారికి రూ.50 లక్షలు..
- అనకాపల్లిలోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు..
- ఇప్పటి వరకు 17 మంది మృతి..
- మెడికవర్ ఆస్పత్రిలో భాదితులకు.. కేజీహెచ్ లో మృతుల కుటుంబాలకు సీఎం పరామర్శ..
- మృతిచెందినవారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున..
- తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ఘోర ప్రమాదం జరిగింది.. అనకాపల్లిలోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు.. అయితే, ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి.. విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా బాధితులతోనూ మాట్లాడి సీఎం చంద్రబాబు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హమీ ఇచ్చారు. ఇక, ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున.. తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు..
మరోవైపు.. విశాఖ కేజీహెచ్లో మృతుల కుటుంబాలను పరామర్శించారు సీఎం చంద్రబాబు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కుటుంబ సభ్యులు చాలా భాదలో ఉన్నారు. కానీ, చనిపోయిన వారిని తీసుకురాలేం. అయితే, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందిస్తాం అన్నారు.. తీవ్రంగా గాయపడిన వారికి యాబై లక్షల రూపాయలు అందిస్తాం అన్నారు.. ఆ కుటుంబాలను ఏవిధంగా ఆదుకోవాలో.. ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా ఆధుకుంటాం అన్నారు.. జరిగిన సంఘటన చాలా భాదాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Also Read
కాగా, ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మంది మృతచెందగా.. 36 మందికి గాయాలయ్యాయి.. అందులో 10 మందికి తీవ్రగాయాలు కాగా.. 26 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. అయితే, వారికి ఎంత ఖర్చు అయినా ఉత్తమ వైద్య సేవలందిస్తాం. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తాం అని ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున.. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50 లక్షల చొప్పున.. స్వల్ప గాయాలైన వారికి రూ.25లక్షల చొప్పున పరిహారం అందిస్తామని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!