AP Crime: పసుపు పారాణి ఆరలేదు.. నవ వధువు దారుణ హత్య..! మృతదేహంతో ఆందోళన..
- పసుపు పారాణి ఆరకముందే.. నవ వధువు దారుణ హత్య..! నెల రోజులు కూడా నిండక ముందే భర్త హత్య చేశాడని ఆరోపణ..
- గొంతు నులిమి.. చెవిపై బలంగా కొట్టి చంపాడంటున్న కుటుంబ సభ్యులు..
- అమలాపురంలోని భర్త ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: పసుపు పారాణి ఆరకముందే.. ఓ నవ వధువు దారుణ హత్యకు గురైనట్టు కటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా నిండక ముందే.. భర్త తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. నవ వధువు గొంతు నులిమి, చెవిపై బలంగా కొట్టడంతోనే రక్తం కారి చనిపోయిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు.. హైదరాబాద్ జరిగిన ఈ ఘటనపై అమలాపురంలోని భర్త ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. భర్త, అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Daggubati Purandeswari: చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే పనులు..
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
పూర్తి విరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తొత్తరమూడి బాలయోగి కాలనీకి చెందిన కుడిపూడి రమ్య సత్యప్రియకు ఆగష్టు 18 వ తేదీన అమలాపురం రూరల్ మండలం వేమవరం- నామాల వారిపాలెంకు చెందిన కొప్పిశెట్టి వెంకటసాయితో వివాహం అయ్యింది. వెంకటసాయి హైదరాబాద్ పఠాన్చెరులో ఎలక్ట్రీషన్ గా పని చేస్తున్నాడు. అమ్మాయి తొత్తరమూడిలో వస్త్ర దుకాణంలో పనిచేసేది. పెళ్లైన తరువాత తొలిసారి అప్పగింతల వరకూ ఇరువురి బంధువుల మధ్య అన్నీ సవ్యంగానే జరిగాయి. ఇక, అమ్మాయి తల్లిదండ్రులు గత నెల 30వ తేదీన చివరి శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతానికి పంపమని అబ్బాయిని కోరడంతో లేనిపోని సాకు చెప్పి రాత్రికి రాత్రే హైదరాబాద్ తీసుకువెళ్లిపోయాడని సోదరుడు రమేష్ తెలిపాడు. అక్కడికి వెళ్లినా సోదరి ఫోన్ చేసే వరకూ హైదరాబాద్ తీసుకెళ్ళిన సంగతి నాకు తెలియదని చెప్పాడు. అనంతరం వారం రోజులు ఫోన్లో మాట్లాడేదని అ దికూడా అమ్మాయికి ఫోన్ ఇవ్వకుండా వాళ్ల ఫోన్ నుంచే మాట్లాడించే వారన్నారు. తరువాత ఏం జరిగిందో ఏమో గానీ.. గత మూడు రోజుల నుంచీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదని.. తిరిగి నాకు ఫోన్ చేసి ఏమి తెలియనట్లు మీ చెల్లికి ఏమైనా అనారోగ్యం ఉందా అని అడిగారని సోదరుడు రమేష్ చెప్పాడు.. ఇక, ఈ నెల 10 వ తేదీన ఫోన్ చేసి మీ చెల్లి చనిపోయిందని చెప్పారని కన్నీటి పర్యంతమయ్యాడు. కావాలనే నా చెల్లిని భర్త వెంకట సాయి, ఆడపడుచు కలిపి చంపేసారని రమేష్ ఆరోపిస్తున్నాడు. మృతదేహంతో అమలాపురం మండలం తొత్తరమూడిలోని భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నా చెల్లెలు మృతి పట్ల పలు అనుమానాలున్నాయని.. మాకు న్యాయం చేయాలని మృతురాలి సోదరుడు రమేష్ కోరుతున్నారు.
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..