Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఏకంగా 24 లక్షల రూపాయలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రజలు సైబర్ నేరాలు బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఎరువులంటూ ఎర వేశారు. ఉచ్చులో చిక్కాక దరువేశారు. అందినకాడికి దోచేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటిపల్లికి చెందిన కొనుకు శ్రీనివాస్ ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి 24 లక్షల రూపాయలు కోల్పోయారు.
Also Read
Perni Nani Quash Petition: పేర్ని నాని క్వాష్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
మొబైల్ ఫోన్లో ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుండగా ఒక ఆకర్షణీయమైన లింక్ కనిపించింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పేరుతో 10 లక్షల రూపాయల విలువైన ఎరువులు పంపిస్తామని.. వాటిని అమ్మితే 5 లక్షల రూపాయల లాభం వస్తుందని ఆ లింక్లో చూపించారు. అంటే సగానికి సగం లాభం. ఇది చూసిన తర్వాత ఎవరైనా ఆశపడకుండా ఉంటారా? అది నిజమని నమ్మిన శ్రీనివాస్.. ఆ లింక్లో లాగిన్ అయ్యారు.
ఇంకేముంది అప్పటికే కాచుకుని కూర్చున్న సైబర్ క్రిమినల్స్ వలకు చిక్కారు శ్రీనివాస్. కొద్ది సేపటికే సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి.. మీకు సరకు లారీ ద్వారా వస్తుందని.. ముందుగా కొన్ని ఛార్జీలు చెల్లించాలని చెప్పారు. మొదట చిన్న మొత్తాలుగా ప్రారంభమైన చెల్లింపులు, తర్వాత పెద్ద మొత్తాలుగా మారాయి. దఫాదఫాలుగా ఫోన్పే ద్వారా మొత్తం 24 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి, సరకు లారీలో వస్తోందని.. మరికొంత మొత్తం వేయాలని అడిగారు. ఈసారి అనుమానం వచ్చిన శ్రీనివాస్ వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశారు.
IND vs NAM: ఇషాన్ కిషన్ మెరుపులు.. హార్దిక్ ఫినిషింగ్ టచ్! నమీబియాకు భారీ టార్గెట్
పోలీసుల చొరవతో బ్యాంకు అధికారులు 24 లక్షల్లో 9 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశారు. మిగతా మొత్తాన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సమాజానికి మార్గదర్శకులు అయిన ఉపాధ్యాయులు కూడా సైబర్ మోసాలకు గురవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై సిఐ భీమరాజు మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గవర్నమెంట్ స్కీమ్ పేరుతో డబ్బు అడిగితే వెంటనే అనుమానించాలని తెలిపారు. అపరిచిత లింక్లపై క్లిక్ చేయకుండా, అధికారిక వెబ్సైట్ల ద్వారానే సమాచారం తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!