Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఏకంగా 24 లక్షల రూపాయలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రజలు సైబర్ నేరాలు బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఎరువులంటూ ఎర వేశారు. ఉచ్చులో చిక్కాక దరువేశారు. అందినకాడికి దోచేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటిపల్లికి చెందిన కొనుకు శ్రీనివాస్ ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి 24 లక్షల రూపాయలు కోల్పోయారు.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
Perni Nani Quash Petition: పేర్ని నాని క్వాష్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
మొబైల్ ఫోన్లో ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుండగా ఒక ఆకర్షణీయమైన లింక్ కనిపించింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పేరుతో 10 లక్షల రూపాయల విలువైన ఎరువులు పంపిస్తామని.. వాటిని అమ్మితే 5 లక్షల రూపాయల లాభం వస్తుందని ఆ లింక్లో చూపించారు. అంటే సగానికి సగం లాభం. ఇది చూసిన తర్వాత ఎవరైనా ఆశపడకుండా ఉంటారా? అది నిజమని నమ్మిన శ్రీనివాస్.. ఆ లింక్లో లాగిన్ అయ్యారు.
ఇంకేముంది అప్పటికే కాచుకుని కూర్చున్న సైబర్ క్రిమినల్స్ వలకు చిక్కారు శ్రీనివాస్. కొద్ది సేపటికే సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి.. మీకు సరకు లారీ ద్వారా వస్తుందని.. ముందుగా కొన్ని ఛార్జీలు చెల్లించాలని చెప్పారు. మొదట చిన్న మొత్తాలుగా ప్రారంభమైన చెల్లింపులు, తర్వాత పెద్ద మొత్తాలుగా మారాయి. దఫాదఫాలుగా ఫోన్పే ద్వారా మొత్తం 24 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి, సరకు లారీలో వస్తోందని.. మరికొంత మొత్తం వేయాలని అడిగారు. ఈసారి అనుమానం వచ్చిన శ్రీనివాస్ వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశారు.
IND vs NAM: ఇషాన్ కిషన్ మెరుపులు.. హార్దిక్ ఫినిషింగ్ టచ్! నమీబియాకు భారీ టార్గెట్
పోలీసుల చొరవతో బ్యాంకు అధికారులు 24 లక్షల్లో 9 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశారు. మిగతా మొత్తాన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సమాజానికి మార్గదర్శకులు అయిన ఉపాధ్యాయులు కూడా సైబర్ మోసాలకు గురవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై సిఐ భీమరాజు మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గవర్నమెంట్ స్కీమ్ పేరుతో డబ్బు అడిగితే వెంటనే అనుమానించాలని తెలిపారు. అపరిచిత లింక్లపై క్లిక్ చేయకుండా, అధికారిక వెబ్సైట్ల ద్వారానే సమాచారం తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!