Daggubati Purandeswari: చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే పనులు..
- రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం అనుకూలమైన ప్రదేశం ఇవ్వలేదు..
- ఆ స్థలం మార్చాలని కోరినా స్పందించలేదు..
- ఇప్పుడు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు..
- ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయన్న పురంధేశ్వరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: సీఎం చంద్రబాబుకు కేంద్ర లేఖ రాసింది.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయన్నారు బీజేపీ ఎంపీ.. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులతో సమావేశం అయిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే బీజేపీ విధానం అన్నారు.. ప్రధాని మోడీ సారథ్యంలో దేశ ప్రజల సంతోషంగా ఉన్నారు.. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డులో మార్పులు చేర్పులు వంటి అంశాలను మోడీ ధైర్యంగా అమలు చేశారు.. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది.. ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు..
Read Also: Chiranjeevi: ఆయన మరణం తీవ్ర మనోవేదనకు గురిచేసింది: చిరంజీవి
Also Read
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
- Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
అమరావతి రాజధాని అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది అని మరోసారి స్పష్టం చేశారు పురంధేశ్వరి.. 2500 కోట్లు నేరుగా నిధులు కూడా గతంలో మంజూరు చేసింది.. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20 వేల కోట్లు.. డీపీఆర్ ఓకే చేశారు.. ఇంటర్నల్ రోడ్ల విస్తరణకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆమోదం తెలిపారు.. అమరావతి ఏపీ రాజధాని కాబట్టే కేంద్రం కూడా ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు.. రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం అనుకూలమైన ప్రదేశం ఇవ్వలేదు.. ఆ స్థలం మార్చాలని కోరినా గత ప్రభుత్వం స్పందించలేదు.. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయని తెలిపారు.. పోలవరం విషయంలో తెలిసీ తెలియని పరిస్థితులు కొన్ని ఉత్పన్నం అయ్యాయి.. నిర్మాణం అయిన డయాఫ్రంవాల్ దెబ్బ తినడం బాధాకరం అన్నారు. నీటి నిల్వకు ఆ ప్రాజెక్టు నిలిచే పరిస్థితి లేదు.. ఇప్పుడు డయా ఫ్రం వాల్ నిర్మాణానికి 990 కోట్లు కేంద్రం ఇస్తుందన్నారు.. ఏపీ అభివృద్ది కోసం బీజేపీ వేల కోట్ల నిధులు కేటాయించిందని గుర్తుచేశారు.. కూటమి ప్రభుత్వం సారధ్యంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందడం ఖాయం అని తెలిపారు పురంధేశ్వరి..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!