Ambati Rambabu: పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్.. అది నిరూపిస్తే రాజీనామా చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Counter Attack On Pawan Kalyan: తనపై జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు తాజాగా స్పందించారు. తాను రెండు లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టు పవన్ నిరూపిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి వెళ్లిపోతానని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో గతంలో పవన్ చేసిన వాగ్ధానాన్ని కూడా తిరిగి తెరపైకి తీసుకొచ్చారు. 2019లో జగన్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పవన్ చెప్పాడని, మరి అది ఏమైందని నిలదీశారు.
Canadian Billionaire Couple: వీడని దంపతుల డెత్ మిస్టరీ.. హంతకుడిపై 300 కోట్లు నజరానా
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
సత్తెనపల్లిలో పవన్ వైసీపీపై విమర్శలు చేసినట్లు కనిపించినా.. ఆయన ఇచ్చిన సందేశం వేరని అంబటి రాంబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్తానని.. బీజేపీకి పవన్ డైరెక్ట్గా మెసేజ్ పంపించారని అన్నారు. చంద్రబాబును గెలిపించటానికి తాను గాడిదలా మోస్తానని, మీరు కూడా నాలాగే గాడిదలా చంద్రబాబుని గెలిపించే బరువును మోయమని అంటున్నాడని, ఈ వ్యూహాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్కు చాలా మందితో విడిపోవటం అలవాటుందని ఎద్దేవా చేశారు. అధికారం రాని కులాలకు అధికారంలోకి తీసుకుని రావటమే జనసేన లక్ష్యమని పవన్ చెప్పారని.. మరి ఆయన ఇదే మాట మీద ఉంటాడా? లేకపోతే చంద్రబాబు దగ్గర పదో, పరకో తీసుకొని పొత్తులతో సర్దుకుంటాడా? అని ప్రశ్నించారు.
Pawan Kalyan: వారాహిని టచ్ చేస్తే.. నేనేంటో చూపిస్తా
పవన్ కాపుల శని అని, పోలవరం పూర్తి చేయనంత మాత్రాన తాను మంత్రిని కానా? అని అంబటి రాంబాబు నిలదీశారు. మరి.. 2018లో చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చాడు? అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. వాళ్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావా? అని సందేహం వ్యక్తం చేశారు. నీ జామకాయ నీ ఇష్టమని, కాపులందరినీ గాడిదల్ని చేయకని సూచించారు. వారాహి అని కాకుండా వాహనం పేరు పంది అని పెట్టుకోమనండని మండిపడ్డారు. కౌలు రైతులను గుర్తించింది తమ ప్రభుత్వమేనని.. గుర్తింపు కార్డ్ ఉండి, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు రూ. 7 లక్షల నష్టపరిహారం ఇస్తున్నామన్నారు. జనసేన రూ. 1 ఇచ్చిన వారు.. గుర్తింపు కార్డ్ ఉన్న కౌలు రైతులు కాదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!