Ambati Rambabu: పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్.. అది నిరూపిస్తే రాజీనామా చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Counter Attack On Pawan Kalyan: తనపై జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు తాజాగా స్పందించారు. తాను రెండు లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టు పవన్ నిరూపిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి వెళ్లిపోతానని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో గతంలో పవన్ చేసిన వాగ్ధానాన్ని కూడా తిరిగి తెరపైకి తీసుకొచ్చారు. 2019లో జగన్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పవన్ చెప్పాడని, మరి అది ఏమైందని నిలదీశారు.
Canadian Billionaire Couple: వీడని దంపతుల డెత్ మిస్టరీ.. హంతకుడిపై 300 కోట్లు నజరానా
Also Read
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
- Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
సత్తెనపల్లిలో పవన్ వైసీపీపై విమర్శలు చేసినట్లు కనిపించినా.. ఆయన ఇచ్చిన సందేశం వేరని అంబటి రాంబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్తానని.. బీజేపీకి పవన్ డైరెక్ట్గా మెసేజ్ పంపించారని అన్నారు. చంద్రబాబును గెలిపించటానికి తాను గాడిదలా మోస్తానని, మీరు కూడా నాలాగే గాడిదలా చంద్రబాబుని గెలిపించే బరువును మోయమని అంటున్నాడని, ఈ వ్యూహాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్కు చాలా మందితో విడిపోవటం అలవాటుందని ఎద్దేవా చేశారు. అధికారం రాని కులాలకు అధికారంలోకి తీసుకుని రావటమే జనసేన లక్ష్యమని పవన్ చెప్పారని.. మరి ఆయన ఇదే మాట మీద ఉంటాడా? లేకపోతే చంద్రబాబు దగ్గర పదో, పరకో తీసుకొని పొత్తులతో సర్దుకుంటాడా? అని ప్రశ్నించారు.
Pawan Kalyan: వారాహిని టచ్ చేస్తే.. నేనేంటో చూపిస్తా
పవన్ కాపుల శని అని, పోలవరం పూర్తి చేయనంత మాత్రాన తాను మంత్రిని కానా? అని అంబటి రాంబాబు నిలదీశారు. మరి.. 2018లో చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చాడు? అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. వాళ్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావా? అని సందేహం వ్యక్తం చేశారు. నీ జామకాయ నీ ఇష్టమని, కాపులందరినీ గాడిదల్ని చేయకని సూచించారు. వారాహి అని కాకుండా వాహనం పేరు పంది అని పెట్టుకోమనండని మండిపడ్డారు. కౌలు రైతులను గుర్తించింది తమ ప్రభుత్వమేనని.. గుర్తింపు కార్డ్ ఉండి, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు రూ. 7 లక్షల నష్టపరిహారం ఇస్తున్నామన్నారు. జనసేన రూ. 1 ఇచ్చిన వారు.. గుర్తింపు కార్డ్ ఉన్న కౌలు రైతులు కాదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
-
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!