Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
- అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు
- అవినీతి కేంద్రంగా అమరావతి?
- మూడు రాజధానుల వివాదం మళ్లీ రగిలింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్కు ఒక శాశ్వత రాజధానిని ఏర్పాటు చేసుకోలేకపోవడం అత్యంత దురదృష్టకరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని ఆయన ధ్వజమెత్తారు. అమరావతి అనేది ఎప్పటికీ పూర్తికాని ఒక అంతులేని కథ అని, అది కేవలం అవినీతికి నిలయంగా మారిందని ఆయన ఆరోపించారు.
House Construction: మీరు ఇంటిని ఏ డబ్బుతో కడుతున్నారు..? స్వాధీనం తప్పుదు..!
Also Read
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు నాయుడు కేవలం కమిషన్లు తీసుకోవడానికి , అవినీతి చేయడానికి అమరావతిని వాడుకుంటున్నారని అంబటి విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు వంటి కీలక భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ, చంద్రబాబు తన స్వార్థం , అతి తెలివితేటల వల్ల వాటిని నిర్మించలేకపోయారని మండిపడ్డారు. శాశ్వత భవనాలు కట్టకుండా అన్నీ తాత్కాలిక భవనాలతోనే కాలక్షేపం చేశారని ఎద్దేవా చేశారు.
Donald Trump: ఇకపై మంచివాడిలా ఉండను, ఇరాన్ ‘‘కిల్లింగ్ మిషన్’’ అంతం చేస్తా..
అమరావతి ప్రాజెక్టుపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తూ, “అమరావతి అనేది ఒక అంతులేని కథ. ఈ జీవితంలోనే కాదు, మరో వంద జీవితాల్లో కూడా అది పూర్తి అయ్యే ప్రాజెక్ట్ కాదు” అని పేర్కొన్నారు. ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తానని ప్రజలను నమ్మించి, తీరా ఏమీ చేయలేకపోయారని ఆయన విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ‘మూడు రాజధానుల’ ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరించాలని ప్రయత్నిస్తే, చంద్రబాబు వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి ఒక అడుగు కూడా ముందుకు పడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తన సొంత రాజకీయ లబ్ధి కోసమే రాజధాని అంశాన్ని నాన్చుతున్నారని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కేవలం తన అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికే అమరావతిని అడ్డం పెట్టుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
-
Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
-
Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
-
CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!