House Construction: మీరు ఇంటిని ఏ డబ్బుతో కడుతున్నారు..? స్వాధీనం తప్పుదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కల. ఆ కలని సాకారం చేసుకోవడానికి సామాన్యులు తమ రక్తాన్ని చెమటగా మార్చి, పైసా పైసా కూడబెడతారు. మరికొందరు బ్యాంకు రుణాల ద్వారా దశాబ్దాల పాటు ఈఎంఐలు చెల్లిస్తూ గూడు నిర్మించుకుంటారు. కానీ.. సమాజంలో కొందరు మాత్రం అడ్డదారుల్లో సంపాదించిన అక్రమ సొమ్ముతో విలాసవంతమైన భవనాలను నిర్మిస్తున్నారు. డ్రగ్స్ మాఫియా, అవినీతి, స్మగ్లింగ్ వంటి అరాచకాల ద్వారా సంపాదించిన ‘నల్లధనం’ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడిగా మారుతోంది. అయితే.. ఇలాంటి అక్రమ కట్టడాలపై ప్రభుత్వాలు ఇప్పుడు ఉక్కుపాదం మోపుతున్నాయి. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.
అక్రమ సంపాదన..
రాజస్థాన్కు చెందిన గోవింద్ రామ్ అనే వ్యక్తి అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల రవాణా చేస్తూ కోట్లాది రూపాయలు గడించాడు. ఆ డబ్బుతో తన భార్య పేరిట సుమారు కోటి రూపాయల విలువైన భారీ నివాసాన్ని నిర్మించాడు. అయితే.. పోలీసుల నిఘాలో అతడి అక్రమ సామ్రాజ్యం బయటపడింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం ప్రకారం.. నేరాల ద్వారా సంపాదించిన ప్రతి రూపాయి అక్రమమే. విచారణలో ఆ ఇల్లు డ్రగ్స్ మనీతోనే కట్టినట్లు తేలడంతో అధికారులు ఆ భవనాన్ని సీజ్ చేశారు.
Also Read
- TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్కు కేంద్రం గుడ్బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
- BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
- RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
- Vijay Mallya: వేల కోట్లు ఎగగొట్టి పోయిన విజయ్ మాల్యా చుట్టూ మళ్లీ హాట్ టాపిక్.. ఎంత వసూలైంది? ఎంత మిగిలిందంటే?
చట్టం ఏం చెబుతోంది?
భారతదేశంలో ఆస్తి కొనుగోలు లేదా నిర్మాణానికి సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఇల్లు కడుతున్నప్పుడు, ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆధారాలతో సహా నిరూపించాల్సి ఉంటుంది. ఒకరు డబ్బు పెట్టి వేరొకరి పేరిట ఆస్తిని కొనుగోలు చేస్తే.. దానికి సరైన లెక్కలు లేని పక్షంలో ‘బినామీ ఆస్తుల నిషేధ చట్టం’ కింద ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుంటుంది. మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులను సీజ్ లేదా స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. నేరం నిరూపితమైతే ఆ ఆస్తి ప్రభుత్వ పరం అవుతుంది.
Also Read:New Pensions: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వారికి కూడా పెన్షన్లు..
కూల్చివేతలు లేదా స్వాధీనం?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అక్రమ కట్టడాల పట్ల ప్రభుత్వాల వైఖరి మారింది. కేవలం సీజ్ చేయడమే కాకుండా, కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నేరస్థుల ఇళ్లను ‘బుల్డోజర్లతో’ కూల్చివేస్తున్నారు. ఒకవేళ నేరపూరిత సొమ్ముతో ఆస్తిని కొంటే, దానిని భవిష్యత్తులో ఎవరికీ విక్రయించే హక్కు కూడా ఉండదు.
నేరంతో సంపాదించిన డబ్బుతో నిర్మించిన భవనాలు చూడ్డానికి ‘సౌధాలు’గా కనిపించవచ్చు, కానీ అవి ఎప్పుడూ చట్టం కనుసన్నల్లోనే ఉంటాయి. నీతిగా, కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న చిన్న గూడైనా ఇచ్చే గౌరవం, ప్రశాంతత అక్రమ సంపాదనతో కట్టిన కోటల్లో దొరకదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నేరస్థుల అక్రమ సామ్రాజ్యాలు కుప్పకూలక తప్పదు.
తాజావార్తలు
-
PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
-
Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Red Fort: ఎర్రకోట ఎందుకు అంత ముఖ్యమైంది? మొఘలుల నుంచి బ్రిటిష్ వరకు.. చరిత్రలోని ఆసక్తికర నిజాలు
-
TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్కు కేంద్రం గుడ్బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
ట్రెండింగ్
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..