Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
- అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు
- అవినీతి కేంద్రంగా అమరావతి?
- మూడు రాజధానుల వివాదం మళ్లీ రగిలింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్కు ఒక శాశ్వత రాజధానిని ఏర్పాటు చేసుకోలేకపోవడం అత్యంత దురదృష్టకరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని ఆయన ధ్వజమెత్తారు. అమరావతి అనేది ఎప్పటికీ పూర్తికాని ఒక అంతులేని కథ అని, అది కేవలం అవినీతికి నిలయంగా మారిందని ఆయన ఆరోపించారు.
House Construction: మీరు ఇంటిని ఏ డబ్బుతో కడుతున్నారు..? స్వాధీనం తప్పుదు..!
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు నాయుడు కేవలం కమిషన్లు తీసుకోవడానికి , అవినీతి చేయడానికి అమరావతిని వాడుకుంటున్నారని అంబటి విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు వంటి కీలక భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ, చంద్రబాబు తన స్వార్థం , అతి తెలివితేటల వల్ల వాటిని నిర్మించలేకపోయారని మండిపడ్డారు. శాశ్వత భవనాలు కట్టకుండా అన్నీ తాత్కాలిక భవనాలతోనే కాలక్షేపం చేశారని ఎద్దేవా చేశారు.
Donald Trump: ఇకపై మంచివాడిలా ఉండను, ఇరాన్ ‘‘కిల్లింగ్ మిషన్’’ అంతం చేస్తా..
అమరావతి ప్రాజెక్టుపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తూ, “అమరావతి అనేది ఒక అంతులేని కథ. ఈ జీవితంలోనే కాదు, మరో వంద జీవితాల్లో కూడా అది పూర్తి అయ్యే ప్రాజెక్ట్ కాదు” అని పేర్కొన్నారు. ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తానని ప్రజలను నమ్మించి, తీరా ఏమీ చేయలేకపోయారని ఆయన విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ‘మూడు రాజధానుల’ ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరించాలని ప్రయత్నిస్తే, చంద్రబాబు వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి ఒక అడుగు కూడా ముందుకు పడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తన సొంత రాజకీయ లబ్ధి కోసమే రాజధాని అంశాన్ని నాన్చుతున్నారని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కేవలం తన అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికే అమరావతిని అడ్డం పెట్టుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!