Ambati Rambabu: అమరావతి అనేదే పెద్ద కుంభకోణం.. ఆ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: అమరావతిపై మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి అనేదే పెద్ద కుంభకోణం అని అభివర్ణించారు. గతంలో సీఎస్గా పనిచేసి రిటైర్ అయిన ఐవీఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరిది ఈ రాజధాని’ అనే పుస్తకంలో ఏం రాశారో అందరూ తెలుసుకోవాలన్నారు. ఆయన బీజేపీలో ఉన్నారని.. కానీ ఆ పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారని మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో కూడా ఒకసారి గుర్తుచేసుకోవాలని కోరారు. అమరావతి ప్రజా రాజధాని కాదు అని పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారని.. పవన్ కళ్యాణ్ ఆ పుస్తకాన్ని ఒకసారి చదివి అప్పుడు రైతుల పాదయాత్ర గురించి మాట్లాడాలని హితవు పలికారు.
Read Also: Tirumala: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్.. ఏ రోజు ఏ వాహన సేవ..?
Also Read
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
అయినా అమరావతి టు అరసవెల్లి పాదయాత్రలో ఒక్క రైతు అయినా ఉన్నాడా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అందులో ఉన్నది అంతా బలిసిన బ్యాచేనని ఆరోపించారు. అభివృద్ధి అంతా ఒకచోట కేంద్రీకరిస్తే ప్రాంతీయ విబేధాలు రావా అని ప్రతిపక్షాలను నిలదీశారు. పాదయాత్ర చేస్తున్న వారు ల్యాండ్ స్కాంలో కూడా ఉన్నారన్నారు. అసైన్డ్ భూములను నారాయణ, గంటా, వారి తాబేదారులు కుంభకోణానికి పాల్పడింది నిజం కాదా అని సూటి ప్రశ్న వేశారు. బీసీ, ఎస్సీల భూములను బెదిరించి లాక్కున్నది నిజం కాదా అన్నారు. పాదయాత్రలో దొంగలతో పాటు దోచుకుందాం అనే ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు డైరెక్షన్లో కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఎలాంటి ఉద్యమాలు రాకూడదు, ప్రాంతీయ విద్వేషాలు చెలరేగకూడదనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం మూడు రాజధానులకు రూపకల్పన చేసిందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!