Amaravati Farmers: సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్తో రైతుల సమావేశం
- సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్ తో రైతుల సమావేశం..
- గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరాం..
- సీఆర్డీఏ ఆధికారులు హేళనగా చూస్తున్నారని కమిషనర్ కి చెప్పిన రైతులు
Amaravati Farmers: సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్ తో రైతుల సమావేశం అయ్యారు. రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. CRDA కార్యాలయం అందుబాటులో ఉండటం ఉపయోగకరంగా ఉంది.. రైతులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి.. వాటిని CRDA కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకున్నామని పేర్కొన్నారు. అమరావతి డీనోట్ చేయమని అడిగాం.. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చేస్తారని అధికారులు చెప్పారు.. R5 జోన్ లో కేటాయించిన వారికి స్థానికంగా ఉండే దగ్గర ఇచ్చి త్వరలో సెటిల్ చేస్తామన్నారు.
Read Also: Cloudflare Outage: క్లౌడ్ఫ్లేర్ ఎఫెక్ట్.. పని చేయని ప్రధాన సైట్లు.. ఎందుకో తెలుసా!
Also Read
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- Off The Record : ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సైలెంట్ వార్.. సొంత నేతలే చెక్ పెడుతున్నారా?
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
అయితే, సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు విషయం త్వరలో మాట్లాడి పరిష్కరిస్తామన్నారని రైతులు తెలిపారు. అలాగే, కరకట్ట బలోపేతం చేయాలని కోరాం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు రాలేదని ప్రశ్నించాం.. గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరాం.. CRDA ఆధికారులు హేళనగా చూస్తున్నారు అని కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళామని రైతులు వెల్లడించారు.
ఇక, గ్రీవెన్స్ లో సమస్యలు పరిష్కారం కాకుండానే అయినట్లు మెసేజ్ లు వస్తున్నాయని అమరావతి రైతులు పేర్కొన్నారు. గ్రీవెన్స్ డిప్యూటీ కలెక్టర్ జయ శ్రీ పై కమిషనర్ కు ఫిర్యాదు చేశాం.. ఇప్పటి వరకు ఇచ్చిన గ్రీవెన్స్ ఫిర్యాదులు ఒకటి కూడా పరిష్కారం కాలేదని కమిషనర్ కు చెప్పాం.. గతంలో 14 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించగా వాటి గురించి ప్రశ్నించాం.. 1 రోడ్డు పోట్లు, 2 గ్రామ కంఠాలు, 3 జరీబు నాన్ జరీబు.. అంశాలు క్లిష్టతరమని కమిషనర్ చెప్పారు.. వాటన్నిటికీ కారణం గతంలో పని చేసిన ల్యాండ్స్ డైరెక్టర్ అనే విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళామని రైతులు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!