Amaravati Farmers: సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్తో రైతుల సమావేశం
- సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్ తో రైతుల సమావేశం..
- గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరాం..
- సీఆర్డీఏ ఆధికారులు హేళనగా చూస్తున్నారని కమిషనర్ కి చెప్పిన రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Farmers: సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్ తో రైతుల సమావేశం అయ్యారు. రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. CRDA కార్యాలయం అందుబాటులో ఉండటం ఉపయోగకరంగా ఉంది.. రైతులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి.. వాటిని CRDA కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకున్నామని పేర్కొన్నారు. అమరావతి డీనోట్ చేయమని అడిగాం.. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చేస్తారని అధికారులు చెప్పారు.. R5 జోన్ లో కేటాయించిన వారికి స్థానికంగా ఉండే దగ్గర ఇచ్చి త్వరలో సెటిల్ చేస్తామన్నారు.
Read Also: Cloudflare Outage: క్లౌడ్ఫ్లేర్ ఎఫెక్ట్.. పని చేయని ప్రధాన సైట్లు.. ఎందుకో తెలుసా!
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
అయితే, సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు విషయం త్వరలో మాట్లాడి పరిష్కరిస్తామన్నారని రైతులు తెలిపారు. అలాగే, కరకట్ట బలోపేతం చేయాలని కోరాం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు రాలేదని ప్రశ్నించాం.. గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరాం.. CRDA ఆధికారులు హేళనగా చూస్తున్నారు అని కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళామని రైతులు వెల్లడించారు.
ఇక, గ్రీవెన్స్ లో సమస్యలు పరిష్కారం కాకుండానే అయినట్లు మెసేజ్ లు వస్తున్నాయని అమరావతి రైతులు పేర్కొన్నారు. గ్రీవెన్స్ డిప్యూటీ కలెక్టర్ జయ శ్రీ పై కమిషనర్ కు ఫిర్యాదు చేశాం.. ఇప్పటి వరకు ఇచ్చిన గ్రీవెన్స్ ఫిర్యాదులు ఒకటి కూడా పరిష్కారం కాలేదని కమిషనర్ కు చెప్పాం.. గతంలో 14 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించగా వాటి గురించి ప్రశ్నించాం.. 1 రోడ్డు పోట్లు, 2 గ్రామ కంఠాలు, 3 జరీబు నాన్ జరీబు.. అంశాలు క్లిష్టతరమని కమిషనర్ చెప్పారు.. వాటన్నిటికీ కారణం గతంలో పని చేసిన ల్యాండ్స్ డైరెక్టర్ అనే విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళామని రైతులు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!