Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ysrcp Files Complaint With National Human Rights Commission Over Kurupam Tribal Girls Hostel Incident

YSRCP: కురుపాం ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు..

Published Date :October 13, 2025 , 5:43 pm
By Sudhakar Ravula
  • కురుపాం ఘట‌న‌పై ఎన్‌హెచ్చార్సీకి వైయ‌స్సార్సీపీ ఫిర్యాదు..
  • సిట్ తో విచార‌ణ జ‌రిపించాల‌ని విజ్ఞప్తి..
  • మృతుల కుటుంబాల‌కు రూ.25 ల‌క్షల ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్..
YSRCP: కురుపాం ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

YSRCP: ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల స్కూల్‌లో హెప‌టైటిస్- ఏ ఇన్ఫెక్షన్ కార‌ణంగా ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘ‌ట‌న‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అర‌కు ఎంపీ త‌నూజా రాణి నేతృత్వంలో వైసీపీ ప్రతినిధుల బృందం ఢిల్లీలో జాతీయ మాన‌వ హక్కుల సంఘాన్ని క‌లిసి ఫిర్యాదు చేసింది. ఎన్‌హెచ్చార్సీ నేతృత్వంలో స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను ఏర్పాటు చేసి ద‌ర్యాప్తు నిర్వహించాల‌ని కోర‌గా.. కమిషన్‌ చైర్మన్‌ సానుకూలంగా స్పందించినట్లు మీడియాకు వెల్లడించింది వైసీపీ ప్రతినిధి బృందం.. ఎంపీ త‌నూజ రాణి ఆధ్వర్యంలో తిరుప‌తి ఎంపీ గురుమూర్తి, అర‌కు ఎమ్మెల్యే రేగ మ‌త్స్యలింగం, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, రాజ‌న్నదొర‌, మాజీ ఎమ్మెల్యే భాగ్యల‌క్ష్మి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధ‌వి, విశాఖ జిల్లా ప‌రిషత్ చైర్ ప‌ర్సన్ సుభ‌ద్ర, ఇచ్ఛాపురం మున్సిపల్ వైస్ చైర్‌ప‌ర్సన్ ఉలాల భార‌తీ దివ్య, మ‌న్యం-పార్వతీపురం జిల్లా వైయ‌స్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప‌రీక్షిత్ రాజు త‌దిత‌రులు మాన‌వ హక్కుల సంఘం చైర్మన్‌ని కలిసిన వైసీపీ ప్రతినిధి బృందంలో ఉన్నారు..

Read Also: Hamas Hostages 2025: ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.. హమాస్ చెర నుంచి విడుదలైన బందీలు

Also Read

  • Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
  • CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
  • Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
  • CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్‌గా బతకాలి..

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ మృతి చెందిన విద్యార్థుల కుటుంబాల‌కు రూ. 25 ల‌క్షల చొప్పున ప‌రిహారం చెల్లించాల‌ని, గురుకుల పాఠ‌శాల‌తోపాటు ప‌క్కనే ఉన్న ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు స్క్రీనింగ్ నిర్వహించాల‌ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కార‌ణంగానే ఇద్దరు విద్యార్థులు మృతిచెందార‌ని, ఈ ఘ‌టన జ‌రిగి వారం రోజుల‌వుతున్నా ప్రభుత్వంలో క‌నీసం చీమ కుట్టిన‌ట్టు కూడా లేద‌ని ధ్వజ‌మెత్తారు. భ‌విష్యత్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అయితే వైయ‌స్సార్సీపీ చూస్తూ ఊరుకోద‌ని హెచ్చరించారు. తాగునీరు క‌లుషితమై కురుపాం- పార్వతీపురం గురుకుల పాఠ‌శాల‌లో చ‌దివే 170 మంది గిరిజ‌న విద్యార్థులు హెప‌టైటిస్ ఏ ఇన్ఫెక్ష‌న్ కి గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స తీసుకున్నారు. అందులో ఇద్దరు విద్యార్థులు చనిపోవ‌డం కూట‌మి ప్రభుత్వం వ‌చ్చాక‌ రాష్ట్రంలోని పాఠ‌శాల‌ల్లో నెల‌కొన్న దారుణ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. ఇద్దరు గిరిజన విద్యార్థులు చ‌నిపోయినా ప్రభుత్వానికి చీమ‌కుట్టిన‌ట్టు కూడా ఉండ‌టం లేదు. చ‌నిపోయిన ఇద్దరు పిల్లల‌కు పోస్ట్‌మార్టం కూడా నిర్వహించ‌లేదని మండిపడ్డారు అర‌కు ఎంపీ త‌నూజారాణి.. ఇక, కూట‌మి ప్రభుత్వం వ‌చ్చాక సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల ప‌రిస్థితి ద‌యనీయంగా మారిందన్నారు పుష్పశ్రీవాణి.. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థుల‌ను ప‌రామ‌ర్శించిన వైఎస్‌ జగన్‌ మృతుల కుటుంబాల‌కు పార్టీ త‌ర‌ఫున రూ. 5 ల‌క్షల చొప్పున ప‌రిహారం అంద‌జేసి వెళ్లారు. మృతుల కుటుంబాల‌కు ప్రభుత్వం త‌ర‌ఫున రూ.25 ల‌క్షల చొప్పున ప‌రిహారం ఇచ్చి అండ‌గా నిల‌బ‌డాలని పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Kurupam tribal deaths
  • Kurupam tribal girls
  • National Human Rights Commission
  • Tribal Girls Residential School

తాజావార్తలు

  • IPL Historic Day: బ్యాట్స్‌మెన్‌ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్‌లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!

  • Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..

  • New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!

  • Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు

  • న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions