YSRCP: కురుపాం ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు..
- కురుపాం ఘటనపై ఎన్హెచ్చార్సీకి వైయస్సార్సీపీ ఫిర్యాదు..
- సిట్ తో విచారణ జరిపించాలని విజ్ఞప్తి..
- మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల స్కూల్లో హెపటైటిస్- ఏ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అరకు ఎంపీ తనూజా రాణి నేతృత్వంలో వైసీపీ ప్రతినిధుల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఎన్హెచ్చార్సీ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించాలని కోరగా.. కమిషన్ చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు మీడియాకు వెల్లడించింది వైసీపీ ప్రతినిధి బృందం.. ఎంపీ తనూజ రాణి ఆధ్వర్యంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుభద్ర, ఇచ్ఛాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతీ దివ్య, మన్యం-పార్వతీపురం జిల్లా వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు తదితరులు మానవ హక్కుల సంఘం చైర్మన్ని కలిసిన వైసీపీ ప్రతినిధి బృందంలో ఉన్నారు..
Read Also: Hamas Hostages 2025: ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.. హమాస్ చెర నుంచి విడుదలైన బందీలు
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, గురుకుల పాఠశాలతోపాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారని, ఈ ఘటన జరిగి వారం రోజులవుతున్నా ప్రభుత్వంలో కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తాగునీరు కలుషితమై కురుపాం- పార్వతీపురం గురుకుల పాఠశాలలో చదివే 170 మంది గిరిజన విద్యార్థులు హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ కి గురై విశాఖ కేజీహెచ్లో చికిత్స తీసుకున్నారు. అందులో ఇద్దరు విద్యార్థులు చనిపోవడం కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని పాఠశాలల్లో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇద్దరు గిరిజన విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా ఉండటం లేదు. చనిపోయిన ఇద్దరు పిల్లలకు పోస్ట్మార్టం కూడా నిర్వహించలేదని మండిపడ్డారు అరకు ఎంపీ తనూజారాణి.. ఇక, కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు పుష్పశ్రీవాణి.. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన వైఎస్ జగన్ మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేసి వెళ్లారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి అండగా నిలబడాలని పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!