YS Jagan: దాడికి గురైన వైసీపీ కార్యకర్తలకు జగన్ ఫోన్.. మనం అధికారంలోకి రాగానే గుణపాఠం చెబుదాం..
- రాజకీయ ప్రత్యర్థుల చేతిలో దాడికి గురైన కార్యకర్తలకు జగన్ పరామర్శ..
- గిరిధర్, సతీష్ను ఫోన్లో పరామర్శించిన జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో రాజకీయ ప్రత్యర్థుల చేతిలో దాడికి గురైన వైసీపీ కార్యకర్తలు గిరిధర్ (ఆర్ఎంపీ డాక్టర్), సతీష్ను ఫోన్లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో ఫోన్లో మాట్లాడిన ఆయన, ఘటన వివరాలు ఆరా తీశారు. పార్టీ కార్యకర్తలపై పాశవికంగా చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.. ధైర్యం కోల్పోవద్దని వారికి సూచించారు. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్న ఆయన, అవసరమైతే మెరుగైన వైద్యం అందించాలని పార్టీ నాయకులకు నిర్దేశించారు.
Read Also: Check Wine Quality: అలర్ట్.. వైన్ నాణ్యత చెక్ చేయడానికి 3 సింపుల్ టెస్ట్లు
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
తమపై ఎలా దాడి చేశారనే విషయాలను జగన్ కు వివరించారు గిరిధర్, సతీష్.. ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైసీపీ నాయకులు, కార్యకర్తలను దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదాం.. పోలీసు వ్యవస్ధను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణం అన్నారు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్.. ఈ అనైతిక కార్యక్రమాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు.. భవిష్యత్తులో కూటమి పార్టీలకు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.. ఇక, పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి.. పార్టీ అందరికీ అండగా ఉంటుంది.. చేయకూడని తప్పులు చేస్తున్న వారికి వైసీపీ అధికారంలోకి రాగానే తగిన గుణపాఠం చెపుతాం అంటూ హెచ్చరించారు వైఎస్ జగన్..
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?