MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మాజీ మంత్రి.. బొత్స పేరును ప్రకటించిన జగన్
- ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ..
- ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స..
- ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం..
- ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలు తీసుకున్న జగన్..
- ఆ తర్వాత బొత్సను అభ్యర్థిగా ప్రకటించిన వైఎస్ జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Elections: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్నారు.. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన జగన్.. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.. ఆ తర్వాత బొత్సను తమ అభ్యర్థిగా ప్రకటించారు వైఎస్ జగన్..
Read Also: Love Harassment: ప్రేమ పేరుతో వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య..
Also Read
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో.. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వారితో ఈ రోజు క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైసీపీకి భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో సహజంగా టీడీపీ పోటీకి పెట్టకూడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జగన్.. కానీ, చంద్రబాబు ఏరోజూ నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదన్నారు.. రకరకాల ప్రలోభాలు, బెదిరింపులతో అడ్డగోలుగా గెలవడానికి ఆయన ప్రయత్నిస్తారని విమర్శించారు.. కుయుక్తులు, కుట్రలు అనేవి చంద్రబాబు నైజం అంటూ ఫైర్ అయ్యారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.. అందుకే పార్టీలో అందరు నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఈ సమావేశం నిర్వహించామన్నారు వైఎస్ జగన్..
Read Also: Wayanad Landslides : ఏడాది క్రితం స్కూల్ అమ్మాయి రాసిన కథే కేరళలోని వయనాడ్ లో నిజమైంది
ఇక, ఈ సమావేశంలో ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు వైఎస్ జగన్.. అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత.. బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.. సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని ఆదేశించారు.. అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఉంటాయని, వాటిని ధీటుగా ఎదుర్కొనేలా అంతా కలిసి ముందుకు సాగాలని స్పష్టం చేశారు వైఎస్ జగన్. కాగా, ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 822 మంది ఓటర్లు ఉన్నారు.. వీరిలో జడ్పీటీసీలు 36 మంది అయితే, ఎంపీటీసీలు 636, కౌన్సిలర్లు 53, కార్పొరేటర్లు 97, ఖాళీగా వున్న స్థానాలు 11గా ఉన్నాయి.. వీరాలో వైసీపీ బలం 600గా చెబుతున్నారు.. కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు 215 ఉండగా.. టచ్ లో వున్న వాళ్లతో కలిపి కూటమి బలం 275కు పైగా ఉందనే లెక్కలు వేస్తున్నారు.. దీంతో.. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
-
Balakrishna : బాలయ్యకి సర్జరీ.. NBK 111 పరిస్థితి ఏంటి?
-
Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
Gabbar Singh Ramesh: గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!