MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మాజీ మంత్రి.. బొత్స పేరును ప్రకటించిన జగన్
- ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ..
- ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స..
- ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం..
- ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలు తీసుకున్న జగన్..
- ఆ తర్వాత బొత్సను అభ్యర్థిగా ప్రకటించిన వైఎస్ జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Elections: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్నారు.. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన జగన్.. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.. ఆ తర్వాత బొత్సను తమ అభ్యర్థిగా ప్రకటించారు వైఎస్ జగన్..
Read Also: Love Harassment: ప్రేమ పేరుతో వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య..
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో.. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వారితో ఈ రోజు క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైసీపీకి భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో సహజంగా టీడీపీ పోటీకి పెట్టకూడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జగన్.. కానీ, చంద్రబాబు ఏరోజూ నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదన్నారు.. రకరకాల ప్రలోభాలు, బెదిరింపులతో అడ్డగోలుగా గెలవడానికి ఆయన ప్రయత్నిస్తారని విమర్శించారు.. కుయుక్తులు, కుట్రలు అనేవి చంద్రబాబు నైజం అంటూ ఫైర్ అయ్యారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.. అందుకే పార్టీలో అందరు నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఈ సమావేశం నిర్వహించామన్నారు వైఎస్ జగన్..
Read Also: Wayanad Landslides : ఏడాది క్రితం స్కూల్ అమ్మాయి రాసిన కథే కేరళలోని వయనాడ్ లో నిజమైంది
ఇక, ఈ సమావేశంలో ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు వైఎస్ జగన్.. అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత.. బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.. సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని ఆదేశించారు.. అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఉంటాయని, వాటిని ధీటుగా ఎదుర్కొనేలా అంతా కలిసి ముందుకు సాగాలని స్పష్టం చేశారు వైఎస్ జగన్. కాగా, ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 822 మంది ఓటర్లు ఉన్నారు.. వీరిలో జడ్పీటీసీలు 36 మంది అయితే, ఎంపీటీసీలు 636, కౌన్సిలర్లు 53, కార్పొరేటర్లు 97, ఖాళీగా వున్న స్థానాలు 11గా ఉన్నాయి.. వీరాలో వైసీపీ బలం 600గా చెబుతున్నారు.. కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు 215 ఉండగా.. టచ్ లో వున్న వాళ్లతో కలిపి కూటమి బలం 275కు పైగా ఉందనే లెక్కలు వేస్తున్నారు.. దీంతో.. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!