Wayanad Landslides : ఏడాది క్రితం స్కూల్ అమ్మాయి రాసిన కథే కేరళలోని వయనాడ్ లో నిజమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Wayanad News : చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. కొన్నిసార్లు పిల్లలు చెప్పినా.. రాసినా అది నిజమవుతాయని అంటారు. అది సరైనదని తేలింది. కేరళలోని వాయనాడ్లో జరిగిన విధ్వంసం మధ్య అలాంటి యాదృచ్చిక సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఓ పాఠశాల బాలిక ఏడాది క్రితమే రాసిందని పేర్కొన్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలిక గతేడాది ఓ కథ రాసిందని చెబుతున్నారు. ఈ కథలోని సంఘటనల గురించి ఆమె రాసినది రాసినట్లు వాయనాడ్ పరిస్థితి దాదాపుగా అలాగే మారింది. ఈ కథనం స్కూల్ మ్యాగజైన్లో కూడా ప్రచురితమైంది. ఒకే తేడా ఏమిటంటే, ఆ కథ సుఖాంతం అయినప్పటికీ, వాస్తవంలో ఇది మాత్రం విషాదంగా మారింది. వాయనాడ్లో ప్రతేడాది ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా జరిగిన విధ్వంసం వల్ల ఇప్పటి వరకు 308మంది చనిపోయారు. మరో 200మందికి పైగా గల్లంతయ్యారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని వాతావరణ శాఖ చెబుతోంది.
Read Also:Harassment: కాలం ఎటుపోతుంది.. రెండో తరగతి చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అసభ్య ప్రవర్తన..
Also Read
ఏ కథ రాశారు
ఎనిమిదో తరగతి చదువుతున్న లయ అనే విద్యార్థిని ఈ కథ రాసింది. ఆమె గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, వాయనాడ్లో చదువుతుంది. లయ కథ గత సంవత్సరం స్కూల్ మ్యాగజైన్లో కూడా ప్రచురించబడింది. లయ రాసిన కథ జలపాతంలో మునిగిపోయే అమ్మాయి గురించి. ఆమె మునిగిపోవడం వల్ల మరణిస్తుంది. మరణం తరువాత ఆమె పక్షి రూపంలో గ్రామానికి తిరిగి వస్తుంది. లయ కథలో పక్షి ఆ ఊరి పిల్లలతో ‘పిల్లలారా, ఈ ఊరి నుంచి పారిపోండి. ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతోంది.’ వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి కొండపై నుండి వర్షపు నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది. అలా చెప్పిన పక్షి అందమైన అమ్మాయిగా మారుతుంది. గ్రామస్తులను రక్షించడానికి ఎవరూరారు. తద్వారా వారు మునిగిపోతారు.
Read Also:TTD EO Syamala Rao: శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లపై టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు
నాన్నను కూడా కోల్పోయింది
ప్రస్తుతం చురమల కొండచరియలు విధ్వంసంలో మునిగిపోయింది. లయ కథలా కాకుండా ఇక్కడి వాతావరణం చాలా బాధాకరం. లయ తన తండ్రి లెనిన్ను కూడా కోల్పోయింది. లయ పాఠశాలలో 497 మంది విద్యార్థుల్లో 32 మంది చనిపోయారు. ఇద్దరు విద్యార్థులు వారి తండ్రి, తోబుట్టువులను కూడా కోల్పోయారు. పాఠశాల కూడా దారుణంగా ధ్వంసమైంది. బలమైన నీటి ప్రవాహం పాఠశాల మైదానం, దాని భవనాలను తీవ్రంగా దెబ్బతీసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి ఉన్నికృష్ణన్.. అతని సహచరులు తృటిలో తప్పించుకున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు చురమలలో అద్దె గదిలో ఉంటున్నామని తెలిపారు. వారం రోజుల క్రితం వర్షం పడినప్పుడు మేము స్కూల్లో ఉండబోతున్నామని చెప్పాడు. కానీ మేము ఇంటికి తిరిగి వచ్చాము. కొండచరియలు విరిగిపడి పాఠశాల దెబ్బతింది. అక్కడే ఉండి ఉంటే మేము కూడా కొట్టుకుపోయే వాళ్లమని తెలిపారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!