Vijayasai Reddy Resigns: రాజ్యసభ చైర్మన్కు సాయిరెడ్డి రాజీనామా లేఖ..
- రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా..
- రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్తో సాయిరెడ్డి సమావేశం..
- తన రాజీనామా లేఖను అందజేసిన విజయసాయిరెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy Resigns: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి.. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్తో సమావేశమైన ఆయన.. తన రాజీనామా లేఖను అందజేశారు.. అయితే, విజయసాయిరెడ్డి రాజీనామాపై ఇంతవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించలేదు.. విజయసాయిరెడ్డి వ్యవహారం కావటంతో స్పందించేందుకు తర్జనభర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది.. పార్టీ అధినేత వైఎస్ జగన్ లండన్ లో ఉండటంతో నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయట పార్టీ వర్గాలు.. విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు.. విజయసాయి రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మారీ రాజీనామా చేయొద్దని కోరారు ఎంపీ గురుమూర్తి.. కానీ, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని శుక్రవారం ప్రకటించిన సాయిరెడ్డి.. ఈ రోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనా చేశారు..
Read Also: Vijayasai Reddy: కాసేపట్లో ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కాగా, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను అని నిన్నే విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం విదితమే.. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదని స్పష్టం చేశారు.. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు.. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకి సదా కృతజ్ఞుడిని అంటూ ట్వీట్ రాసుకొచ్చారు. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.. మరోవైపు.. టీడీపీతో రాజకీయంగా విభేదించా.. చంద్రబాబుతో గానీ, ఆయన కుటుంబంతో గానీ వ్యక్తి గతంగా విభేదాలు లేవని.. పవన్ కల్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని పేర్కొన్నారు.. ఇక, నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అంటూ సుదీర్ఘమైన పోస్టును విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పోస్టు చేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!