Vijayasai Reddy Resigns: రాజ్యసభ చైర్మన్కు సాయిరెడ్డి రాజీనామా లేఖ..
- రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా..
- రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్తో సాయిరెడ్డి సమావేశం..
- తన రాజీనామా లేఖను అందజేసిన విజయసాయిరెడ్డి..
Vijayasai Reddy Resigns: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి.. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్తో సమావేశమైన ఆయన.. తన రాజీనామా లేఖను అందజేశారు.. అయితే, విజయసాయిరెడ్డి రాజీనామాపై ఇంతవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించలేదు.. విజయసాయిరెడ్డి వ్యవహారం కావటంతో స్పందించేందుకు తర్జనభర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది.. పార్టీ అధినేత వైఎస్ జగన్ లండన్ లో ఉండటంతో నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయట పార్టీ వర్గాలు.. విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు.. విజయసాయి రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మారీ రాజీనామా చేయొద్దని కోరారు ఎంపీ గురుమూర్తి.. కానీ, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని శుక్రవారం ప్రకటించిన సాయిరెడ్డి.. ఈ రోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనా చేశారు..
Read Also: Vijayasai Reddy: కాసేపట్లో ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా
Also Read
- AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
- AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా..
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
కాగా, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను అని నిన్నే విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం విదితమే.. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదని స్పష్టం చేశారు.. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు.. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకి సదా కృతజ్ఞుడిని అంటూ ట్వీట్ రాసుకొచ్చారు. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.. మరోవైపు.. టీడీపీతో రాజకీయంగా విభేదించా.. చంద్రబాబుతో గానీ, ఆయన కుటుంబంతో గానీ వ్యక్తి గతంగా విభేదాలు లేవని.. పవన్ కల్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని పేర్కొన్నారు.. ఇక, నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అంటూ సుదీర్ఘమైన పోస్టును విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పోస్టు చేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
-
IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Muskmelon Health Risks: కర్బూజా కొనుగోలు చేసే ముందు.. తినకూడని వారు ఎవరు? ముఖ్య జాగ్రత్తలు
-
Heinrich Klaasen: ఇక ‘డాడీ డ్యూటీ’ మొదలవుతుంది.. ఎస్ఆర్హెచ్ హీరో క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?