Deputy CM Post Controversy: లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలని డిమాండ్..! టీడీపీ కీలక ఆదేశాలు
- ఏపీలో కాకరేపుతోన్న లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్..
- ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్..
- అత్యుత్సాహం వద్దని నేతలను వారించిన టీడీపీ అధిష్టానం..
- కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని స్పష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Post Controversy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంత కాలంగా.. నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ కాకరేపుతోంది.. దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యింది.. అత్యుత్సాహం వద్దని నేతలను వారించింది టీడీపీ అధిష్టానం.. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని స్పష్టం చేసింది..
Also Read
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
అయితే, గత నాగుగైదు రోజులుగా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలనే డిమాండ్ ఏపీలో కాకరేపుతోంది.. ఈ మధ్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో.. ఆయన ముందే.. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి.. మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ స్టేజ్పైనే మాట్లాడారు.. ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేష్దే అని.. టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ ‘యువగళం’తో ఆయన సమాధానం చెప్పారని.. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు. దీనిపై మరికొందరు టీడీపీ నేతలు.. కీలకంగా ఉన్నవారు సైతం.. ఈ డిమాండ్ చేస్తూ వచ్చారు.. మరోవైపు.. జనసేన నుంచి దీనిపై కౌంటర్ ఎటాక్ మొదలైంది.. ముఖ్యంగా సోషల్ మీడియాలో.. లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయండి.. తప్పులేదు.. కానీ, పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిని చేయాలంటూ కామెంట్లు పెట్టసాగారు.. దీంతో, అలర్ట్ అయిన టీడీపీ అధిష్టానం.. ఇది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే ముప్పు ఉంటుందని భావించి.. ఈ చర్చకు పులిస్టాప్ పెట్టాలని భావంచింది.. ఈ వ్యవహారంపై ఎవరూ కామెంట్లు చేయవద్దని స్పష్టం చేసింది.. దావోస్ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఇష్యూకు తెరదించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే నేతల డిమాండ్పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది.. అత్యుత్సాహం వద్దని నేతలను టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..