AP Liquor Scam Case: హెడ్ కానిస్టేబుల్ లేఖపై స్పందించిన సిట్.. కీలక విషయాలు వెల్లడి..
- సంచలనంగా మారిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ..
- లిక్కర్ స్కామ్ కేసు, మదన్ రెడ్డి వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సిట్..
- ఏ1 రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డికి ముడుపులు చేరాయన్న సిట్..
- మదన్ రెడ్డి విచారణకు సహకరించలేదు..
- అధికారుల పేర్లు రాసి చనిపోతానని బెదిరించాడన్న సిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఏపీ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ రాయడం సంచలనంగా మారింది.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, డీజీపీకి లేఖ రాసిన మదన్ రెడ్డి.. పదేళ్ల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్మెన్గా పనిచేశా.. లిక్కర్ కేసులో నేను చెప్పినట్లు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని పేర్కొన్నాడు.. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన సిట్.. లిక్కర్ స్కాం కేసులో కీలక విషయాలు వెల్లడించింది.. బలవంతంగా వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్నారని.. వినకపోతే దాడి చేస్తున్నారన్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖపై క్లారిటీ ఇస్తూ.. మద్యం స్కాం కేసులో ముడుపులు ఏ1 రాజ్ కేసిరెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరాయి.. గత ఎన్నికలలో ప్రజలకు ఈ డబ్బు చెవిరెడ్డి పంచినట్టు తెలిసింది.. విచారణలో భాగంగా చెవిరెడ్డి గన్మెన్గా పనిచేసిన మదన్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచింది.. కానీ, విచారణకు సహకరించకుండా అధికారుల పేర్లు రాసి చనిపోతానని మదన్ బెదిరించాడని వెల్లడించింది..
Read Also: Anupama Parameshwaran : యాక్టింగ్ రాదని అవమానించారు.. అనుపమ షాకింగ్ కామెంట్స్
Also Read
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
ఇక, సిట్ పారదర్శకంగా విచారణ చేస్తోంది.. ఇప్పటి వరకు 200 మందికి నోటీసులు ఇచ్చి విచారించడం జరిగింది.. ఎప్పుడూ ఈ ఆరోపణలు రాలేదని తెలింపింది సిట్.. మదన్రెడ్డి కొత్త డ్రామాకు తెర తీశాడు.. దీని వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేసింది.. చెవిరెడ్డితో సంబంధం ఉన్న బాలాజీ యాదవ్ ను సిట్ నిర్బంధించినట్టు హైకోర్టులో పిటిషన్ వేశారు.. ఈ రెండు ఘటనలు పరిశీలిస్తే సిట్ ను బలహీన పరిచి అధికారులపై ఒత్తిడి తెచ్చే కుట్ర జరుగుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి.. మదన్ రెడ్డి ఆరోపణలు అవస్తవమైనా.. విచారణ చేయాలని డీజీపీని కోరతాం.. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా చర్యలు తీసుకోవాలని కోరాం.. సిట్ ఎవరి బెదిరింపులకు లొంగదు.. స్కాంలో తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది సిట్..
Read Also: POCO F7: కాస్త ఆలస్యమైనా కిరాక్ ఫీచర్లతో గ్లోబల్ లాంచ్ కు సిద్దమైన పోకో F7..!
కాగా, ఏపీ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సంచలన లేఖ రాశారు.. సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీకి లేఖ రాసిన మదన్ రెడ్డి.. పదేళ్ల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్మెన్గా పనిచేశా.. లిక్కర్ కేసులో నేను చెప్పినట్లు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని ఆరోపించారు.. నా కంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్లే విన్నాడని అధికారులు చెప్పారు.. విచారణకు యూనిఫామ్లో వెళ్లనందుకు నన్ను తిట్టారు.. చెవిరెడ్డికి కేసులో సంబంధం ఉందని చెప్పామన్నారు.. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు నాపై సిట్ అధికారులు దాడులు చేశారని సంచలన ఆరోపణలు చేశారు.. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు హాజరుకాలేను అంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..