Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Sand Mafia Focus On Free Sand In Andhra Pradesh

Sand Mafia: ఉచిత ఇసుకపై మాఫియా కన్ను.. ఆ చిన్న అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుని..!

Published Date :July 10, 2024 , 7:51 pm
By Sudhakar Ravula
  • వినియోగదారులందరికీ ఉచిత ఇసుక పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్..
  • తమ బుర్రలకు పదునుపెట్టిన సాండ్ మాఫియా..
  • ప్రభుత్వ నిబంధనల్లో లొసుగులు వెతుకుతోన్న మాఫియా..
  • ప్రభుత్వ పథకాన్ని క్యాష్‌ చేసుకునే పనిలో ఇసుక దొంగలు..
Sand Mafia: ఉచిత ఇసుకపై మాఫియా కన్ను.. ఆ చిన్న అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుని..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sand Mafia: ఏపీ ప్రభుత్వం వినియోగదారులందరికీ ఉచిత ఇసుక పథకాన్ని తీసుకొచ్చింది.. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది.. అయితే.. ప్రభుత్వం ప్రకటించిందో లేదో, సాండ్ మాఫియా మాత్రం తమ బుర్రలకు పదును పెట్టే పనిలో పడింది.. ప్రభుత్వం ఒక్కొక్క వినియోగదారుడికి రోజుకు 20 మెట్రిక్ టన్నులు ఇసుక తీసుకెళ్లడానికి అనుమతినిచ్చింది.. దీనికోసం ఉచితంగా ఇసుక తీసుకువెళ్లే వినియోగదారుడు, ఆధార్ కార్డు నెంబరు సబ్మిట్ చేసి.. డిజిటల్ పేమెంట్ విధానంలో ప్రభుత్వానికి డబ్బులు కట్టి ఇసుక తీసుకువెళ్లాలి.. ఈ ఒక్క నిబంధన తప్ప ఇతర నిబంధనలు ఏవి ప్రభుత్వం పెట్టలేదు.. వినియోగదారులు తీసుకెళుతున్న ఇసుక ఎందుకోసం తీసుకెళ్తున్నాడు ? నిర్మాణాలు చేస్తున్నారా? ఏ నిర్మాణాల కోసం ఉపయోగిస్తున్నారు? అనేటువంటి విషయాలు ఏమి ప్రభుత్వం అడగడం లేదు. దీంతో, ఎప్పటినుంచో ఇసుక మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సాండ్ మాఫియా.. తమ బుర్రకు పదును పెట్టింది.. వాస్తవానికి గ్రామాల్లో గాని, పట్టణాల్లో గాని, భవన నిర్మాణాలు చేసే వారి సంఖ్య పదులు, లేదా వందల సంఖ్యలో మాత్రమే ఉంటుంది.. మిగతా వారంతా ఇసుకతో పెద్దగా పని లేనివారే.. ఈ చిన్న అంశాన్ని ఇసుక మాఫియా తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది.

Read Also: CM Chandrababu: సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్, విన్ ఫాస్ట్ ప్రతినిధుల భేటీ.. రాష్ట్రంలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు..!

Also Read

  • CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!
  • Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
  • Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
  • CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష

గ్రామాల్లో గృహ నిర్మాణాలు చేసే వారు ఎలాగూ ఇసుక తీసుకెళ్తారు.. ఇక మిగతావారు ఖాళీగా ఉంటారు కాబట్టి, వాళ్ల పేర్లతో ఉన్న ఆధార్ కార్డులు సబ్మిట్ చేసి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోనే అమౌంట్ వేసి డిజిటల్ పేమెంట్ చేస్తే, ఎంచక్కా ఇసుకను తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లో విక్రయించవచ్చు అన్న ఆలోచనతో ఉన్నారు ఇసుక మాఫియా గ్యాంగులు.. ఆలోచన కాదు ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.. గ్రామాల్లో ఉన్న అమాయక ప్రజల నుండి ఆధార్ కార్డులు సేకరించి, వారికి అంతో ఇంతో ఇస్తామని నమ్మించి, ఆధార్ కార్డులు డిజిటల్ పేమెంట్ తో సహా ఇసుక రీచ్ లకు తీసుకువెళ్లి ఇసుక కొనుగోలు చేస్తున్నారట.. ఎటు తిరిగి ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది, డిజిటల్ పేమెంట్ కూడా అమాయక ప్రజలు చేస్తారు కాబట్టి , తీసుకువెళ్తున్న ఇసుకకు స్టాండ్ మాఫియా కు ఎలాంటి సంబంధం లేనట్లుగా కనిపిస్తుంది. ఇసుక ఎవరు తీసుకెళ్తున్నారు ? అనే విషయం ఎందుకు తీసుకెళ్తున్నారు అనే విషయం , ఇసుక స్టాక్ పాయింట్ లో గాని, డంపింగ్ పాయింట్ లో గాని అధికారులు అడగరు.. కాబట్టి యధేచ్ఛగా తమ అక్రమ ఇసుక వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు అన్న ఆలోచనతో ఉన్నారు ఇసుక మాఫియా గ్యాంగులు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి విషయాలు మీద దృష్టి పెట్టి, నిజమైన వినియోగదారులకు ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ వస్తుంది.. మరి చూడాలి ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది , ఇసుక మాఫియాను ఎలా డీల్ చేస్తారో రాబోయే రోజుల్లో ఇసుక మాఫియాని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెడుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap govt
  • cm chandrababu
  • free sand
  • sand mafia

తాజావార్తలు

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions