Sand Mafia: ఉచిత ఇసుకపై మాఫియా కన్ను.. ఆ చిన్న అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుని..!
- వినియోగదారులందరికీ ఉచిత ఇసుక పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్..
- తమ బుర్రలకు పదునుపెట్టిన సాండ్ మాఫియా..
- ప్రభుత్వ నిబంధనల్లో లొసుగులు వెతుకుతోన్న మాఫియా..
- ప్రభుత్వ పథకాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఇసుక దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sand Mafia: ఏపీ ప్రభుత్వం వినియోగదారులందరికీ ఉచిత ఇసుక పథకాన్ని తీసుకొచ్చింది.. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది.. అయితే.. ప్రభుత్వం ప్రకటించిందో లేదో, సాండ్ మాఫియా మాత్రం తమ బుర్రలకు పదును పెట్టే పనిలో పడింది.. ప్రభుత్వం ఒక్కొక్క వినియోగదారుడికి రోజుకు 20 మెట్రిక్ టన్నులు ఇసుక తీసుకెళ్లడానికి అనుమతినిచ్చింది.. దీనికోసం ఉచితంగా ఇసుక తీసుకువెళ్లే వినియోగదారుడు, ఆధార్ కార్డు నెంబరు సబ్మిట్ చేసి.. డిజిటల్ పేమెంట్ విధానంలో ప్రభుత్వానికి డబ్బులు కట్టి ఇసుక తీసుకువెళ్లాలి.. ఈ ఒక్క నిబంధన తప్ప ఇతర నిబంధనలు ఏవి ప్రభుత్వం పెట్టలేదు.. వినియోగదారులు తీసుకెళుతున్న ఇసుక ఎందుకోసం తీసుకెళ్తున్నాడు ? నిర్మాణాలు చేస్తున్నారా? ఏ నిర్మాణాల కోసం ఉపయోగిస్తున్నారు? అనేటువంటి విషయాలు ఏమి ప్రభుత్వం అడగడం లేదు. దీంతో, ఎప్పటినుంచో ఇసుక మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సాండ్ మాఫియా.. తమ బుర్రకు పదును పెట్టింది.. వాస్తవానికి గ్రామాల్లో గాని, పట్టణాల్లో గాని, భవన నిర్మాణాలు చేసే వారి సంఖ్య పదులు, లేదా వందల సంఖ్యలో మాత్రమే ఉంటుంది.. మిగతా వారంతా ఇసుకతో పెద్దగా పని లేనివారే.. ఈ చిన్న అంశాన్ని ఇసుక మాఫియా తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది.
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
గ్రామాల్లో గృహ నిర్మాణాలు చేసే వారు ఎలాగూ ఇసుక తీసుకెళ్తారు.. ఇక మిగతావారు ఖాళీగా ఉంటారు కాబట్టి, వాళ్ల పేర్లతో ఉన్న ఆధార్ కార్డులు సబ్మిట్ చేసి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోనే అమౌంట్ వేసి డిజిటల్ పేమెంట్ చేస్తే, ఎంచక్కా ఇసుకను తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లో విక్రయించవచ్చు అన్న ఆలోచనతో ఉన్నారు ఇసుక మాఫియా గ్యాంగులు.. ఆలోచన కాదు ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.. గ్రామాల్లో ఉన్న అమాయక ప్రజల నుండి ఆధార్ కార్డులు సేకరించి, వారికి అంతో ఇంతో ఇస్తామని నమ్మించి, ఆధార్ కార్డులు డిజిటల్ పేమెంట్ తో సహా ఇసుక రీచ్ లకు తీసుకువెళ్లి ఇసుక కొనుగోలు చేస్తున్నారట.. ఎటు తిరిగి ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది, డిజిటల్ పేమెంట్ కూడా అమాయక ప్రజలు చేస్తారు కాబట్టి , తీసుకువెళ్తున్న ఇసుకకు స్టాండ్ మాఫియా కు ఎలాంటి సంబంధం లేనట్లుగా కనిపిస్తుంది. ఇసుక ఎవరు తీసుకెళ్తున్నారు ? అనే విషయం ఎందుకు తీసుకెళ్తున్నారు అనే విషయం , ఇసుక స్టాక్ పాయింట్ లో గాని, డంపింగ్ పాయింట్ లో గాని అధికారులు అడగరు.. కాబట్టి యధేచ్ఛగా తమ అక్రమ ఇసుక వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు అన్న ఆలోచనతో ఉన్నారు ఇసుక మాఫియా గ్యాంగులు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి విషయాలు మీద దృష్టి పెట్టి, నిజమైన వినియోగదారులకు ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ వస్తుంది.. మరి చూడాలి ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది , ఇసుక మాఫియాను ఎలా డీల్ చేస్తారో రాబోయే రోజుల్లో ఇసుక మాఫియాని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!