Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు సవాల్ ఏడ్చినట్లుగా వుంది.. దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడు..!
- జగన్ అసెంబ్లీ హాజరుపై బాబు విసిరిన సవాల్ ఏడ్చినట్లుగా ఉంది..
- చంద్రబాబుకి దమ్ము, ధైర్యం ఉంటే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి..
- ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు..?
Sajjala Ramakrishna Reddy: వైఎస్ జగన్ అసెంబ్లీ హాజరుపై సీఎం చంద్రబాబు విసిరిన సవాల్ ఏడ్చినట్లుగా ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుకి దమ్ము, ధైర్యం ఉంటే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.. అసలు, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు..? అని ప్రశ్నించారు.. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల పక్షాన గొంతు వినిపిస్తాం… మీ మంద బలంతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. అందుకే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.. ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు సమాధానాలు చెప్పటానికి జగన్ ఒక్కరు చాలు అన్నారు.. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడితేనే సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. అయితే, జగన్ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు సమస్యలు చెప్పడానికి వస్తున్నారని తెలిపారు..
Read Also: Pawan Kalyan : చిరంజీవి వద్దన్న మూవీలో నటించిన పవన్.. చివరకు
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
చంద్రబాబు, లోకేష్ కు అభిమానులు ఉండరు.. ఇక్కడ జగన్ ని కలవడానికి వేల మంది వస్తున్నారు. చంద్రబాబు ముప్పై ఏళ్ల సీఎం అంటే ఎన్టీఆర్ ని ఎలా వెన్నుపోటు పొడిచారనే గుర్తుకు వస్తుంది. చంద్రబాబు వెన్నుపోటుపై సంబరాలు చేసుకోవాలని సలహా ఇచ్చారు సజ్జల.. అత్యధిక మెజార్టీ గెలిచిన ఎన్టీఆర్ ని దింపేశారు. చంద్రబాబు పదవి కోసం కుటుంబ సభ్యులను ఎలా మేనేజ్ చేశారో తెలుసన్నారు.. కోర్టులను చంద్రబాబు మేనేజ్ చేశారని విమర్శించారు.. జగన్ కి ప్రతిపక్ష హోదా ఇస్తామని స్పీకర్ ఒక మాట చెబితే చాలు.. అయినా స్పీకర్ బూతుల్లో ఎక్స్పర్ట్.. ఆయన ప్రజా స్వామ్యం గురించి మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు.. అసెంబ్లీకి దమ్ము ఉంటే రా అని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు అంటున్నారో అర్ధం కావడం లేదన్న సజ్జల.. రైతులు యూరియా కొరత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. యూరియా కోసం రైతులు వందల మంది చెప్పులు పెట్టి లైన్ లో వుంటున్నారు. కుప్పంలో కూడా రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే వెంట పడి కొడతారని హెచ్చరించారు.. చంద్రబాబు మోసం చేశారని ప్రజలు భావిస్తున్నారు. ఆయనకు ప్రజల దగ్గరకి వెళ్లాలి అంటే భయం ఉంది.. ఇటీవల ఆయన కార్యక్రమాలు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలోనే ఉంటున్నాయని వ్యాఖ్యానించారు సజ్జల రామకృష్ణారెడ్డి..
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?