Thalliki Vandanam Scheme: శుభవార్త.. ఖాతాల్లో తల్లికి వందనం సొమ్ము..!
- తల్లికి వందనం పథకంపై శుభవార్త..
- పెండింగ్ దరఖాస్తులకు మంత్రి నారా లోకేష్ ఆమోదం..
- రూ.325 కోట్లు రిలీజ్ కు అనుమతి..
- త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకంపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీలో తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు.. విద్యా శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన లోకేష్.. పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ కు అనుమతి ఇచ్చారు.. దీంతో, త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ము జమకానుంది.. మరోవైపు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్..
Read Also: KGF Actor Death : విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత
Also Read
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
కాగా, ఏపీలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద.. 1వ క్లాస్ నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు విద్యార్థుల తల్లులకు ఆర్థిక చేయూత అందిస్తోంది.. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు జమ చేస్తున్న విషయం విదితమే.. ఒక్కో విద్యార్థికి ఈ పథకం కింద రూ.15 వేలు కేటాయిస్తున్న ప్రభుత్వం.. అందులో రూ. 13 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేసి.. మిగిలిన రూ. 2 వేలు పాఠశాల నిర్వహణ గ్రాంట్ కోసం కలెక్టర్ల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.. దీంతో, ప్రతి విద్యార్థి తల్లికి రూ. 13 వేలు అందుతాయి. అంటే, ఇద్దరు పిల్లలున్న తల్లులకు రూ. 26 వేలు, ముగ్గురు పిల్లలున్న తల్లులకు రూ.39 వేలు.. ఇక, నలుగురు పిల్లలున్న తల్లులకు రూ. 52 వేలు.. వారి ఖాతాల్లో జమ చేసింది.. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన సొమ్ము విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యింది.. కానీ, కొన్ని కారణాల వల్ల, మరికొన్ని పెండింగ్లో పడ్డాయి.. అయితే, తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు.. విద్యా శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన లోకేష్.. పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ కు అనుమతి ఇచ్చారు.. దీంతో, త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ము త్వరలోనే జమ కానుంది.
తాజావార్తలు
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!