Minister Narayana: మద్యం టెండర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. మంత్రి ఆగ్రహం
- వైసీపీ తీరుపై మంత్రి నారాయణ ఫైర్
- మద్యం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం
- గత ఎన్నికల్లో నా కోసం పని చేసిన కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటే తప్పా..?- మంత్రి
- నెల్లూరులో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు.. మద్యం టెండర్లు వేసుకోవచ్చు- మంత్రి
- తప్పుడు ప్రచారం చేసే జగన్ 11 సీట్లకు పరిమితం అయ్యారు- నారాయణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ తీరుపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటే తప్పా..? అని ప్రశ్నించారు. బార్లు.. మద్యం వ్యాపారాలను గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు లాక్కొన్నారు.. మద్యం టెండర్లు వేయొద్దని తానెవర్నీ బలవంతం చేయలేదు..? అని చెప్పారు. నెల్లూరులో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు.. మద్యం టెండర్లు వేసుకోవచ్చని అన్నారు. గత ఐదేళ్లల్లో వ్యాపారం చేసుకోవాలి అంటే భయం.. తమ కార్యకర్తలతో తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కష్టబడిన కార్యకర్తలకు సంవత్సరానికి రూ. 10 కోట్లు చొప్పున రూ. 50 కోట్లు ఇస్తానని చెప్పాను.. ఇప్పటికే రూ. 2 కోట్లు ఇచ్చానని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu: ఇంద్రకీలాద్రికి సీఎం.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
- CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
గత వైసీపీ ప్రభుత్వంలో ఏ వ్యాపారం చేయాలన్న నెల్లూరు 10 నుంచి 20 శాతం షేర్ ఇవ్వాల్సిందేనని అన్నారు. అందరూ వ్యాపారం చేసుకోవాలి.. రాష్ట్రానికి ఆదాయం పెరగాలనేదే తమ ఉద్దేశ్యం అని మంత్రి నారాయణ తెలిపారు. ఎవ్వరైనా వ్యాపారం చేయడానికి స్వేచ్ఛ ఉంటుంది.. ఇప్పుడు నెల్లూరు సిటీలో అందరూ ఆనందంగా ఉన్నారు.. 250 కుటుంబాలకు ఆదాయం వచ్చే నిర్ణయాన్ని అడ్డుకొని గతంలో నెల్లూరులో హోటల్ కట్టకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తాము వచ్చాక నిమిషాల్లో అనుమతులు ఇచ్చాం.. దీనీ వల్ల ఆదాయం పెరుగుతుంది, ఉపాధి కలుగుతుందని చెప్పారు. నెల్లూరులో నారాయణ ఇలా చేసుకుంటూ పోతే వైసీపీ జీరో అయిపోతుందనే భయం కలుగుతుందని మంత్రి నారాయణ అన్నారు.
Read Also: Haryana Elections: బీజేపీకి పెరిగిన మరింత బలం.. ఇద్దరు ఇండిపెండెంట్లు చేరిక..
మరోవైపు.. తప్పుడు ప్రచారం చేసే జగన్ 11 సీట్లకు పరిమితం అయ్యారని మంత్రి నారాయణ విమర్శించారు. వరదల కోసం రూ. 602 కోట్లు పరిహరం ఇస్తే.. రూ. 5 వేల కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేశారని అంటారా..? అని దుయ్యబట్టారు. రోజుకు 12 లక్షల ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశాం.. సీఎం చంద్రబాబు ఫీల్డులో ఉన్నారు.. ప్రజల కష్టాలు చూశారు. జగన్ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారని తెలిపారు. తాగు నీరుకే కాకుండా ఇతర అవసరాలకు కూడా వాటర్ బాటిళ్లు సప్లై చేశాం.. చంద్రబాబు చేసిన వరద సాయాన్ని ఎవ్వరూ మరిచిపోవడం లేదు.. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా వరద సాయం అందించారన్నారు. జగన్ ఇలాగే మాట్లాడుతూ పోతే పులివెందులలో కూడా ఓడిపోతారని అన్నారు. 11 సీట్లు కూడా పోయి వైసీపీ సున్నానే మిగులుతుంది.. అసలు ఆ స్థాయిలో సాయం అందించవచ్చనే ఆలోచనైనా జగనుకు రాదని పేర్కొన్నారు. రోడ్లు కొట్టించి మరీ నీటిని బయటకు పంపాం.. జగన్ ఇస్తానన్న కోటి రూపాయల సాయం ఏమైంది..? సీఎం రిలీఫ్ ఫండ్ లెక్కల్లో అయితే జగన్ ఇచ్చిన విరాళం లేదని మంత్రి నారాయణ తెలిపారు.
తాజావార్తలు
-
E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Realme 17 Pro+: రియల్మీ 17 ప్రో+.. 200MP కెమెరా, 1.5K OLED డిస్ప్లేతో అదుర్స్! లీకైన స్పెసిఫికేషన్స్ ఇవే
-
DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!