AP Legislative Council: మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి లోకేష్..
- శాసన మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేష్
- లోకాయుక్త స్ఫూర్తిని కొనసాగిస్తాం- నారా లోకేష్
- మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాని పరిస్థితి- మంత్రి లోకేష్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత లేకపోయినా లోకాయుక్త స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. శాసనసభలో ప్రతిపక్ష నేత లేని నేపథ్యంలో లోకాయుక్త మెంబర్స్ సెలెక్షన్ కమిటీ కాంపోజిషన్స్ గురించి ఏపీ లోకాయుక్త అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి ఛైర్మన్, శాసనసభ స్పీకర్, హోంమంత్రి గాని లేదా ఏదైనా శాఖ మంత్రి, ప్రతిపక్ష నేత, కౌన్సిల్ ఛైర్మన్ సభ్యులుగా ఉండేవారని మంత్రి తెలిపారు.
Read Also: AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..
Also Read
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో మిగిలిన నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ ఉంటుందని లోకేష్ అన్నారు. ఛైర్మన్ నియామకానికి సంబంధించి ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది.. సాధారణంగా లోకాయుక్తకు రిటైర్డ్ సీజే గాని, హైకోర్టు రిటైర్డ్ జడ్జి గాని ఛైర్మన్ గా ఉంటారు.. ఉప లోకాయుక్తకు డిస్ట్రిక్ట్ రిటైర్డ్ జడ్జి ఛైర్మన్గా ఉంటారని మంత్రి లోకేష్ చెప్పారు. సవరణ బిల్లులో ప్రతిపక్ష నేత లేని సమయంలో అని మాత్రమే ఉంది.. తాము తీసివేయలేదని.. మనం అందరం ప్రజాస్వామ్యంలో భాగస్వాములేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఎవరు ఛైర్మన్, సభ్యులు అనేది.. స్పీకర్, మండలి ఛైర్మన్ నిర్ణయిస్తారన్నారు. ఓటింగ్కు వైసీపీ గైర్హాజరైంది.. మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాని పరిస్థితి అని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!