AP Legislative Council: మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి లోకేష్..
- శాసన మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేష్
- లోకాయుక్త స్ఫూర్తిని కొనసాగిస్తాం- నారా లోకేష్
- మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాని పరిస్థితి- మంత్రి లోకేష్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత లేకపోయినా లోకాయుక్త స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. శాసనసభలో ప్రతిపక్ష నేత లేని నేపథ్యంలో లోకాయుక్త మెంబర్స్ సెలెక్షన్ కమిటీ కాంపోజిషన్స్ గురించి ఏపీ లోకాయుక్త అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి ఛైర్మన్, శాసనసభ స్పీకర్, హోంమంత్రి గాని లేదా ఏదైనా శాఖ మంత్రి, ప్రతిపక్ష నేత, కౌన్సిల్ ఛైర్మన్ సభ్యులుగా ఉండేవారని మంత్రి తెలిపారు.
Read Also: AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..
Also Read
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
- AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో మిగిలిన నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ ఉంటుందని లోకేష్ అన్నారు. ఛైర్మన్ నియామకానికి సంబంధించి ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది.. సాధారణంగా లోకాయుక్తకు రిటైర్డ్ సీజే గాని, హైకోర్టు రిటైర్డ్ జడ్జి గాని ఛైర్మన్ గా ఉంటారు.. ఉప లోకాయుక్తకు డిస్ట్రిక్ట్ రిటైర్డ్ జడ్జి ఛైర్మన్గా ఉంటారని మంత్రి లోకేష్ చెప్పారు. సవరణ బిల్లులో ప్రతిపక్ష నేత లేని సమయంలో అని మాత్రమే ఉంది.. తాము తీసివేయలేదని.. మనం అందరం ప్రజాస్వామ్యంలో భాగస్వాములేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఎవరు ఛైర్మన్, సభ్యులు అనేది.. స్పీకర్, మండలి ఛైర్మన్ నిర్ణయిస్తారన్నారు. ఓటింగ్కు వైసీపీ గైర్హాజరైంది.. మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాని పరిస్థితి అని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!