Minister Nadendla Manohar: కాకినాడ పోర్టులో పట్టుపడిన రేషన్ బియ్యం.. మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
- కాకినాడ పోర్టులో పట్టుబడిన రేషన్ బియ్యం..
- కాకినాడ పోర్టు వద్ద ఒక ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తాం..
- మూడు షిఫ్టుల్లో భద్రత పెంచుతామన్న మంత్రి మనోహర్..
- ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో మార్పులు చేపడతామని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla Manohar: కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుబడిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అయితే, మీడియా చిట్చాట్లో ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. కాకినాడ పోర్టు వద్ద ఒక ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తామన్న ఆయన.. మూడు షిఫ్టుల్లో భద్రత పెంచుతాం.. ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో మార్పులు చేపడతాం అన్నారు.. ఐపీసీ ఇన్వాల్వ్ చేసేలా రవాణా వ్యవస్ధ కఠినతరం చేస్తామని వెల్లడించారు.. అయితే, ఇక్కడ నుంచి వెళ్ళేప్పుడు 48 వేల కోట్లు.. అక్కడికి చేరాక అది డబుల్ అవుతోందన్నారు.. మమ్మల్ని చాలా మంది తప్పుదోవ పట్టించాలని చూసారు.. అక్కడ చెక్ పోస్టులు పెట్టినా ఒక షిప్టు లేకుండా చేసి మరీ పీడీఎస్ రైస్ తరలింపుకు సిద్ధమయ్యారు.. బియ్యం అక్రమ రవాణ ఆర్గనైజ్డ్ క్రైం. ఇక నుంచి బియ్యం స్మగ్లింగ్ ను ఆర్గనైజడ్ క్రైంగా కేసులు నమోదు చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Uber Shikara Ride: ‘షికారా’ పేరుతో మొట్టమొదటి సారి అలాంటి సేవలను అందించబోతున్న ఉబెర్ ఇండియా
Also Read
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
ఇక, పీడీ యాక్ట్ క్రింద రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారిని తీసుకువచ్చే చట్టం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందన్నారు నాదెండ్ల.. కాకినాడు పోర్టులో బియ్యం అక్రమ రవాణా కేసులో 28 కంపెనీలు ప్రమేయం వుంది. వీరంతా ముఠాగా ఏర్పడి దక్షిణ ఆఫ్రికాకు స్మగ్లింగ్ చేస్తున్నారని వెల్లడించారు.. నేను ఇచ్చిన సమాచారం, నా ఆదేశాల మేరకే కాకినాడ పోర్టులో స్టెల్లా నౌకను కలెక్టర్ తనిఖీలు చేశారని తెలిపారు.. షిప్ ను కూడా సీజ్ చేస్తాం. షిప్ ను సీజ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.. మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపిస్తున్న.. మంత్రి పయ్యావులు కేశవ్ వియ్యంకుడి షిప్ వివరాలు ఇస్తే వాటిని కూడా తనిఖీ చేస్తాం.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు.. ఇక, నేను మంత్రిగా బాధ్యలు చేపట్టిన ఐదు నెలల్లో 6 ఏ కేసులు 1066 నమోదు చేశాము. ఇది రికార్డుగా పేర్కొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!