Minister Nadendla Manohar: కాకినాడ పోర్టులో పట్టుపడిన రేషన్ బియ్యం.. మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
- కాకినాడ పోర్టులో పట్టుబడిన రేషన్ బియ్యం..
- కాకినాడ పోర్టు వద్ద ఒక ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తాం..
- మూడు షిఫ్టుల్లో భద్రత పెంచుతామన్న మంత్రి మనోహర్..
- ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో మార్పులు చేపడతామని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla Manohar: కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుబడిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అయితే, మీడియా చిట్చాట్లో ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. కాకినాడ పోర్టు వద్ద ఒక ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తామన్న ఆయన.. మూడు షిఫ్టుల్లో భద్రత పెంచుతాం.. ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో మార్పులు చేపడతాం అన్నారు.. ఐపీసీ ఇన్వాల్వ్ చేసేలా రవాణా వ్యవస్ధ కఠినతరం చేస్తామని వెల్లడించారు.. అయితే, ఇక్కడ నుంచి వెళ్ళేప్పుడు 48 వేల కోట్లు.. అక్కడికి చేరాక అది డబుల్ అవుతోందన్నారు.. మమ్మల్ని చాలా మంది తప్పుదోవ పట్టించాలని చూసారు.. అక్కడ చెక్ పోస్టులు పెట్టినా ఒక షిప్టు లేకుండా చేసి మరీ పీడీఎస్ రైస్ తరలింపుకు సిద్ధమయ్యారు.. బియ్యం అక్రమ రవాణ ఆర్గనైజ్డ్ క్రైం. ఇక నుంచి బియ్యం స్మగ్లింగ్ ను ఆర్గనైజడ్ క్రైంగా కేసులు నమోదు చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Uber Shikara Ride: ‘షికారా’ పేరుతో మొట్టమొదటి సారి అలాంటి సేవలను అందించబోతున్న ఉబెర్ ఇండియా
Also Read
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
ఇక, పీడీ యాక్ట్ క్రింద రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారిని తీసుకువచ్చే చట్టం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందన్నారు నాదెండ్ల.. కాకినాడు పోర్టులో బియ్యం అక్రమ రవాణా కేసులో 28 కంపెనీలు ప్రమేయం వుంది. వీరంతా ముఠాగా ఏర్పడి దక్షిణ ఆఫ్రికాకు స్మగ్లింగ్ చేస్తున్నారని వెల్లడించారు.. నేను ఇచ్చిన సమాచారం, నా ఆదేశాల మేరకే కాకినాడ పోర్టులో స్టెల్లా నౌకను కలెక్టర్ తనిఖీలు చేశారని తెలిపారు.. షిప్ ను కూడా సీజ్ చేస్తాం. షిప్ ను సీజ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.. మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపిస్తున్న.. మంత్రి పయ్యావులు కేశవ్ వియ్యంకుడి షిప్ వివరాలు ఇస్తే వాటిని కూడా తనిఖీ చేస్తాం.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు.. ఇక, నేను మంత్రిగా బాధ్యలు చేపట్టిన ఐదు నెలల్లో 6 ఏ కేసులు 1066 నమోదు చేశాము. ఇది రికార్డుగా పేర్కొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!