Kolusu Partha Sarathy: రోజా అన్నీ గాలి మాటలు మాట్లాడుతుంది.. మంత్రి విమర్శనాస్త్రాలు
- వైసీపీపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు
- రైతులందరూ ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు- మంత్రి
- కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తోంది- పార్థసారథి
- ఏపీలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి- మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ వ్యవహార శైలి మార్చుకోవడం లేదని పార్టీలో అందరూ మారుతున్నారని తెలిపారు. సంక్రాంతి కేవలం కూటమి నాయకులకే అని వైసీపీ నేతలంటున్నారు.. సంక్రాంతి ఎవరికో అవగాహన లేకుండా, క్షేత్రస్థాయిలో అంశాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతులు అందరూ ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు.. గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలు అన్నీ పునరుద్ధరించాం.. కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ద్వారా భయానికి గురైన ప్రజల భయాన్ని పోగొట్టాం.. అన్న క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ఆకలి తీరుస్తున్నాం.. NREGS ద్వారా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సిమెంట్ రోడ్లు గ్రామాలకు వచ్చాయని వెల్లడించారు.
Read Also: India-Bangladesh: బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్కు భారత్ సమన్లు..
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
వైసీపీ పాలనలో రూ.6679 కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తే… కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే రూ.85 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి.. రూ. 65 వేల కోట్లతో సీబీజీ ప్లాంట్లు పెట్టడానికి MoUతో పాటు అనుమతులు కూడా వచ్చాయని అన్నారు. మరోవైపు.. మాజీ మంత్రి రోజా అన్నీ గాలి మాటలు మాట్లాడుతుందని మంత్రి విమర్శించారు. 2018-19లో అదానీ డేటా సెంటర్ కు కేటాయిస్తే… ఆ సెంటర్ రావడానికి వైసీపీ ప్రయత్నించలేదని తెలిపారు. వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో తెలుసుకోవాలని మంత్రి సూచించారు.
Read Also: Team India: 8 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా స్టార్ ప్లేయర్..!
జగన్ విధానం బెదిరించడం, కక్ష కట్టడం అని మంత్రి పార్థసారథి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అంశంలో జగన్వి పగటి కలలా, రాత్రి కలలా అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ధాన్యం సేకరణ చేసి డబ్బులు ఎగ్గొట్టారని తెలిపారు. గృహ నిర్మాణాల విషయంలో కేంద్ర సహాయం అందుతోందని గుర్తుంచుకున్నాం.. అందుకే PMAY NTR NAGAR అని పెట్టామన్నారు. మరోవైపు.. నూజివీడు గ్రావెల్ తవ్వకాలపై పూర్తి వివరాలు త్వరలో చెబుతానని పేర్కొ్న్నారు. నూజివీడులో గ్రావెల్ తవ్వకాలపై యార్లగడ్డ వెంకట్రావు సమాచార లోపంతో మాట్లాడి ఉంటారని మంత్రి పార్థసారథి అన్నారు.
తాజావార్తలు
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే?
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!