Team India: 8 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా స్టార్ ప్లేయర్..!
- ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్
- ఎనిమిదేళ్లుగా జట్టుకు దూరం
- తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ
- మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా స్టార్ ప్లేయర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2016లో చెన్నైలో ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఎనిమిదేళ్లుగా జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్పై అతని ఇన్నింగ్స్ ఒక చారిత్రాత్మక ఇన్నింగ్స్.. నాయర్ తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అయితే ఆ తర్వాత నాయర్కు ఎక్కువ అవకాశాలు లభించలేదు.. అంతేకాకుండా జట్టులో కూడా ఉండలేకపోయాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్మన్ పట్టు వదలని విక్రమార్కుడిలా.. ఇప్పుడు మరోసారి సెలక్టర్ల రాడార్లో నిలిచాడు.
Read Also: Mahakumbh 2025 : ‘భారత్ చాలా గొప్పది’.. సనాతన ధర్మాన్ని కొనియాడిన విదేశీ భక్తులు (వీడియోలు)
Also Read
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
కరుణ్ నాయర్ 2018లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు. ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించారు. అప్పటి నుంచి నాయర్ జట్టులోకి పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీ చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. నాయర్ భారత్ తరఫున ఆరు టెస్టు మ్యాచ్లు ఆడాడు. అందులో అతను 374 పరుగులు చేశాడు. ఇంగ్లండ్పై అజేయంగా 303 పరుగులు చేశాడు.
Read Also: IPS Transfers: ఏపీలో ఐపీఎస్లు బదిలీలు.. ఉత్తర్వులు జారీ
ఓ వార్తాపత్రిక నివేదిక ప్రకారం.. విజయ్ హజారే ట్రోఫీలో విదర్భకు ఆడుతున్నప్పుడు నాయర్ యొక్క ప్రదర్శనపై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో.. టెస్టు జట్టులోకి తిరిగి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టెస్టు జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానంపై సంక్షోభం నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో జట్టులో వారి స్థానాన్ని నాయర్ భర్తీ చేసే అవకాశం ఉంది. నాయర్కు దేశవాళీ క్రికెట్లో అనుభవం ఉంది.. అతని అనుభవంతో సీనియర్ ఆటగాడిలా ఆడగలడు. ఈ క్రమంలో.. నాయర్ టీమిండియాకు తిరిగి వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. నాయర్ మొదట కర్ణాటక జట్టుకు ఆడేవాడు.. ఇప్పుడు విదర్భ జట్టుకు ఆడుతున్నాడు.
తాజావార్తలు
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..