Minister Kollu Ravindra: నకిలీ మద్యం తయారీ కేసు.. కీలక అంశాలు వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర..
- వైఎస్ జగన్ రాజకీయ జీవితం శవ యాత్రలతో స్టార్ట్..
- సంచలన వ్యాఖ్యలు చేసిన కొల్లు రవీంద్ర..
- నకిలీ మద్యంపై విచారణ జరుగుతోంది..
- దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు అని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kollu Ravindra: నకిలీ మద్యం తయారీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది.. ఈ కేసులోని పరిణామాలపై స్పందించిన ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో ఈ నెల 3న ఎన్ఫోర్స్మెంట్ ఒక నివేదిక ఇచ్చింది.. నకిలీ మద్యం తయారీకి సంబంధించి సమాచారం వచ్చింది. నకిలీ మద్యం సఫ్లయ్ చేసే వ్యాన్ లు కూడా ఐడెంటిపై చేసాం.. సంబంధిత అధికారులు దాడులు చేశారు. 30 క్యాన్ ల స్పిరిట్ ఉంది… వెంటనే విచారణకు ఆదేశాలు ఇచ్చాం అన్నారు.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన అద్దెపల్లి జనార్దన్ రావ్ కనుసన్నల్లోనే నకిలీ మద్యం వ్యవహారం జరిగిందని తెలిపారు కొల్లు రవీంద్ర.. తమిళనాడు, ఒడిశాకు సంబంధించి కూడా కొంతమంది ఉన్నారు. తెనాలికి సంబంధించిన కొడాలి శ్రీనివాస్ కూడా ఉన్నారు అని వెల్లడించారు.
Read Also: Nayanthara : 22 ఏళ్ల సినీ జర్నీ.. ప్రతి షాట్ నా జీవితాన్ని మార్చింది
Also Read
రాక్ స్టార్, ఆంధ్ర వైన్స్.. రెండు కంపెనీలు ప్రధానంగా ఉన్నాయి.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావ్ కు షాపులు ఉన్నాయి అని పేర్కొన్నారు కొల్లు రవీంద్ర.. ఎక్సయిజ్ శాఖ ప్రస్తుతం చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నాం… అన్ని బ్రాండ్స్ మద్యం.. ప్రస్తుతం అందుబాటులో ఉంది. నకిలీ మద్యాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.. గత ప్రభుత్వంలో డిస్టీలరీస్ స్వాధీనం చేసుకున్నారన్న ఆయన.. సీఎం చంద్రబాబు నకిలీ మద్యం పై విచారణకు ఆదేశాలు ఇచ్చారు.. జయచంద్రా రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం.. అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని సూచించారు..
ఇక, వైఎస్ జగన్ రాజకీయ జీవితం శవ యాత్రలతో స్టార్ట్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు కొల్లు రవీంద్ర.. 600 మంది తన తండ్రి (వైఎస్ రాజశేఖర్రెడ్డి) మరణం తట్టు కోలేక చనిపోయారని జగన్ శవ యాత్రలు చేశారన్నారు.. అయితే, నకిలీ మద్యంపై విచారణ జరుగుతోంది… దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.. వైఎస్ జగన్ దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారు.. టెలీ కాన్ఫెరెన్స్ పెట్టి.. ఎవరు ఎలా చనిపోయినా.. నకిలీ మద్యం వల్లే అని ప్రచారం చేయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర..
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!