దక్షిణాది సినీ పరిశ్రమలో “లేడీ సూపర్స్టార్”గా గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార అనితి కాలంలోనే అభిమానుల హృదయాలను గెలుచుకుంది. భాష పరిమితులు లేకుండా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో అగ్రనటులతో నటించి స్టార్డమ్ను అందుకుంది. అయితే తాజాగా ఆమె సినీ ప్రయాణం 22 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా నయనతార సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ నోట్ పంచుకున్నారు. “మొదటి సారి కెమెరా ముందు నిల్చొని నేటికి 22 ఏళ్లు అయింది. సినిమాలే నా ప్రపంచమవుతాయని అప్పటికి తెలియదు. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి మౌనం నన్ను మార్చేశాయి. నాకు ధైర్యాన్నిచ్చాయి, నన్ను నన్నుగా తీర్చిదిద్దాయి” అంటూ ఆమె రాసిన మాటలు అభిమానుల మనసులు హత్తుకుంటున్నాయి.
Also Read : ‘Dude’ Trailer : ప్రదీప్ ‘డ్యూడ్’ ట్రైలర్ రిలీజ్.. చూస్తుంటే మళ్ళీ హిట్ కొట్టేలా ఉన్నాడే
2003లో మలయాళ సినిమా ‘మనస్సినక్కరే’ ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టిన నయనతార, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్తో చేసిన ‘చంద్రముఖి’ ఆమెకు టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత వరుస హిట్స్తో దక్షిణాది తెరపై తన ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలు, సీరియస్ రోల్స్, హారర్ కథలు, ఫ్యామిలీ డ్రామాలు ఇలా.. ఏ జానర్ అయినా నయనతారకు న్యాయం చేయగలదనే నమ్మకం ప్రేక్షకులలో ఏర్పడింది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా, తన వ్యక్తిగత జీవితం, కుటుంబం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఆమె ప్రత్యేకత.
ఇటీవల ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నయనతారకు అక్కడ కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. 22 ఏళ్ల సినీ ప్రయాణంలో నయనతార సాధించిన విజయాలు, తాను చూపిన కట్టుబాటు, మహిళా నటీమణులు కోసం సృష్టించిన కొత్త మార్గం ఇవన్నీ ఆమెను నిజమైన “లేడీ సూపర్స్టార్”గా నిలబెట్టాయి.