Minister Anagani Satya Prasad : మదనపల్లె ఘటనపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన కోసమే..!?
- అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం..
- ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి అనగాని సత్య ప్రసాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anagani Satya Prasad : అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనపై రెండోసారి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు… ఉదయం నుంచి జరుగుతున్న దర్యాప్తు అంశాలపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు సీఎం.. దగ్దమైన దస్త్రాలు ఏయే విభాగాలకు చెందినవి, ఆధారాల సేకరణలో నిర్లక్ష్యానికి కారకులెవరు అనే అంశాలపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు.. అయితే, ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పి పుచ్చేందుకే ఈ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేసిన ఆయన.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి వేయి కోట్ల అవివీతి బాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు.. ఇక మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం మొన్నటి వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కంట్రోల్లోనే ఉందని విమర్శించారు.
Read Also: Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్ నా ఫ్రెండ్.. ఆవేశంతో ఊగిపోయిన RJ శేఖర్ భాషా
Also Read
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
- YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
మరోవైపు.. నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ల్యాండ్ కన్వెర్షన్ జరిగిందని విమర్శించారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.. ల్యాండ్ కన్వెర్షన్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించిన తర్వాతే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం ఘటన చోటు చేసుకుందన్న ఆయన.. పెద్దిరెడ్డి మీద.. స్థానిక వైసీపీ నేతల మీదే మాకు అనుమానం ఉందన్నారు.. ఆదివారం పూట ఉద్యోగులు పని చేయడం ఎందుకు..? అని ప్రశ్నించారు. ఆర్డీవో, ఎమ్మార్వో సహా ఉద్యోగులు, అధికారుల మొబైల్స్ సీజ్ చేశాం. ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించమని స్పష్టం చేశారు.. అవినీతి ఆరోపణలు ఫైళ్లు మాయం అవుతున్నాయి.. దగ్ధం అవుతున్నాయి. ఉద్యోగులు పని చేస్తే సక్రమంగా చేయండి.. లేకుంటే పక్కకు తప్పుకోండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. గత ప్రభుత్వ అవినీతిని కప్పి పుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవిందా..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..