Madanapalle Incident: మదనపల్లి ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madanapalle Incident: మదనపల్లిలో జరిగిన దారుణ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొంటూ, బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించి ముందుగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేశారని అనిత తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ముద్దాయి డ్రగ్స్ లేదా గంజాయి సేవించలేదని, అయితే మితిమీరిన మద్యం సేవించినట్లు గుర్తించామని వెల్లడించారు. మొదట బాలిక అదృశ్యమై ఉండవచ్చని అనుకున్నామని, కానీ స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టి బాలిక మృతదేహాన్ని ఆమె ఇంటి ఎదురుగా గుర్తించారని తెలిపారు.
నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికులు ఆందోళనకు దిగారని హోంమంత్రి చెప్పారు. అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉండటంతో, విచారణకు ఆటంకం కలగకుండా బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకి, నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అతడు బెయిల్పై బయటకు రాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇటువంటి ఘటనలపై తమ ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
Also Read
- Pawan Kalyan: నేషనల్ వార్ మెమోరియల్కు పవన్ కల్యాణ్.. వీర జవాన్లకు నివాళి.. ఫొటోలు..
- CM Chandrababu Singapore Visit: సింగపూర్లో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ..
- Pawan Kalyan: దేశం ముందా.. పార్టీ ముందా? జనసేన స్పష్టమైన సందేశం
- Jana Sena Five Key Resolutions: ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’.. ఐదు తీర్మానాలకు ఆమోదం
కాగా, మదనపల్లిలో చిన్నారి హత్య కేసు ఉద్రిక్తతకు దారి తీసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుంటూ ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ సహా ఇతర పోలీసు అధికారులు స్థానికులతో చర్చలు జరిపారు.. ఆందోళన కారణంగా చెన్నై–ముంబై జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని కచ్చితంగా కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామంటూ కడప ఎస్పీ విశ్వనాధ్ స్థానికులకు వివరించే ప్రయత్నం చేస్తున్న స్థానికులు ఆందోళన విరమించక పోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తాజావార్తలు
-
Kerala: నిపా నుంచి షిగెల్లా వరకు..కొత్త వ్యాధుల అడ్డాగా కేరళ ఎందుకు నిలుస్తోంది?
-
Actor Vishal : బొకేలు, శాలువాలు పక్కనబెట్టి కాలేజీ స్నేహితుల కలయిక
-
Anil Ravipudi: ఆ రేర్ ఫీట్కు ఒక్క అడుగు దూరంలో అనిల్ రావిపూడి.. కింగ్తో క్రేజీ కాంబో ఫిక్స్?
-
DMK: వెన్నుపోటుదారుడు, అతను బీజేపీకే లాభం.. రాహుల్ గాంధీపై డీఎంకే దాడి..
-
Early Menopause: 40ఏళ్లలోపే పీరియడ్స్ ఆగిపోతున్నాయా? లాన్సెట్ నివేదికలో కీలక విషయాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?