Minister Anagani Satya Prasad: భూముల రీ సర్వే.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్..
- గత ప్రభుత్వం రీ సర్వే సరైన పద్ధతిలో చేయలేదు..
- కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారు..
- ఇప్పుడు పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది..
- హక్కులకు భంగం లేకుండా భూ సర్వే..
- ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామన్న మంత్రి అనగాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anagani Satya Prasad: గత ప్రభుత్వం రీ సర్వే సరైన పద్ధతిలో చేయలేదు.. కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారు అని విమర్శించారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అయితే, పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది.. హక్కులకు భంగం లేకుండా భూ సర్వే జరుగుతుంది.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామని వెల్లడించారు.. రెవెన్యూశాఖ పని తీరు.. భూ పరిష్కారాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భూమి సెంటిమెంట్ అర్ధం చేసుకుంటూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం.. గ్రామాల్లో చాలా భూములు వివాదాల్లో ఉంటాయి. 10 లక్షల రూపాయల కన్నా తక్కువ విలువ గల భూమిని… గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.. హౌసింగ్ ఫర్ ఆల్… అనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.. రెండేళ్లలోపు ఇంటి స్థలం.. మూడేళ్లలోపు ఇల్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. పేదల ఇల్లు… జర్నలిస్టులకు ఇంటి స్థలాలకు సంబంధించి మంత్రి వర్గ ఏర్పాటు అవుతుందన్నారు.
Read Also: HHVM Trailer : ‘వీరమల్లు’ ట్రైలర్ సంచలన రికార్డు..
Also Read
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
- AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
చెయ్యలేని భూ సమస్యలు చాలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆధార్ లింక్.. సర్వే నెంబర్ లింక్ తో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు మంత్రి అనగాని.. ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి ఇప్పటి వరకు మంత్రి వర్గ ఉప సంఘం చర్చించింది. అక్టోబర్ 2కి ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.. రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలు.. 4 లక్షలు పైగా ఉన్నాయి. అభ్యంతరం లేని భూముల పరిష్కారం జీవో 30తో రెగ్యులైజెషన్ జరుగుతుందన్నారు.. సుపరిపాలన.. తొలి అడుగు కార్యక్రమంలోనే క్రమబద్దీకరణపై నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.. గత పరిపాలకులు చేసిన పొరబాట్ల కారణంగా భూముల యజమానుల ఎంట్రీస్ అలసత్వాలు జరిగాయి.. రెవెన్యూలో ఎవరైనా అధికారులు తప్పులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం.. మదనపల్లి ఘటన నుంచే అధికారులపై చర్యలు మొదలయ్యాయి.. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ లో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!