Minister Anagani Satya Prasad: భూముల రీ సర్వే.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్..
- గత ప్రభుత్వం రీ సర్వే సరైన పద్ధతిలో చేయలేదు..
- కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారు..
- ఇప్పుడు పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది..
- హక్కులకు భంగం లేకుండా భూ సర్వే..
- ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామన్న మంత్రి అనగాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anagani Satya Prasad: గత ప్రభుత్వం రీ సర్వే సరైన పద్ధతిలో చేయలేదు.. కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారు అని విమర్శించారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అయితే, పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది.. హక్కులకు భంగం లేకుండా భూ సర్వే జరుగుతుంది.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామని వెల్లడించారు.. రెవెన్యూశాఖ పని తీరు.. భూ పరిష్కారాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భూమి సెంటిమెంట్ అర్ధం చేసుకుంటూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం.. గ్రామాల్లో చాలా భూములు వివాదాల్లో ఉంటాయి. 10 లక్షల రూపాయల కన్నా తక్కువ విలువ గల భూమిని… గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.. హౌసింగ్ ఫర్ ఆల్… అనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.. రెండేళ్లలోపు ఇంటి స్థలం.. మూడేళ్లలోపు ఇల్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. పేదల ఇల్లు… జర్నలిస్టులకు ఇంటి స్థలాలకు సంబంధించి మంత్రి వర్గ ఏర్పాటు అవుతుందన్నారు.
Read Also: HHVM Trailer : ‘వీరమల్లు’ ట్రైలర్ సంచలన రికార్డు..
Also Read
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
చెయ్యలేని భూ సమస్యలు చాలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆధార్ లింక్.. సర్వే నెంబర్ లింక్ తో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు మంత్రి అనగాని.. ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి ఇప్పటి వరకు మంత్రి వర్గ ఉప సంఘం చర్చించింది. అక్టోబర్ 2కి ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.. రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలు.. 4 లక్షలు పైగా ఉన్నాయి. అభ్యంతరం లేని భూముల పరిష్కారం జీవో 30తో రెగ్యులైజెషన్ జరుగుతుందన్నారు.. సుపరిపాలన.. తొలి అడుగు కార్యక్రమంలోనే క్రమబద్దీకరణపై నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.. గత పరిపాలకులు చేసిన పొరబాట్ల కారణంగా భూముల యజమానుల ఎంట్రీస్ అలసత్వాలు జరిగాయి.. రెవెన్యూలో ఎవరైనా అధికారులు తప్పులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం.. మదనపల్లి ఘటన నుంచే అధికారులపై చర్యలు మొదలయ్యాయి.. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ లో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!