Minister Anagani Satya Prasad: భూముల రీ సర్వే.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్..
- గత ప్రభుత్వం రీ సర్వే సరైన పద్ధతిలో చేయలేదు..
- కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారు..
- ఇప్పుడు పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది..
- హక్కులకు భంగం లేకుండా భూ సర్వే..
- ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామన్న మంత్రి అనగాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anagani Satya Prasad: గత ప్రభుత్వం రీ సర్వే సరైన పద్ధతిలో చేయలేదు.. కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారు అని విమర్శించారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అయితే, పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది.. హక్కులకు భంగం లేకుండా భూ సర్వే జరుగుతుంది.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామని వెల్లడించారు.. రెవెన్యూశాఖ పని తీరు.. భూ పరిష్కారాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భూమి సెంటిమెంట్ అర్ధం చేసుకుంటూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం.. గ్రామాల్లో చాలా భూములు వివాదాల్లో ఉంటాయి. 10 లక్షల రూపాయల కన్నా తక్కువ విలువ గల భూమిని… గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.. హౌసింగ్ ఫర్ ఆల్… అనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.. రెండేళ్లలోపు ఇంటి స్థలం.. మూడేళ్లలోపు ఇల్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. పేదల ఇల్లు… జర్నలిస్టులకు ఇంటి స్థలాలకు సంబంధించి మంత్రి వర్గ ఏర్పాటు అవుతుందన్నారు.
Read Also: HHVM Trailer : ‘వీరమల్లు’ ట్రైలర్ సంచలన రికార్డు..
Also Read
చెయ్యలేని భూ సమస్యలు చాలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆధార్ లింక్.. సర్వే నెంబర్ లింక్ తో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు మంత్రి అనగాని.. ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి ఇప్పటి వరకు మంత్రి వర్గ ఉప సంఘం చర్చించింది. అక్టోబర్ 2కి ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.. రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలు.. 4 లక్షలు పైగా ఉన్నాయి. అభ్యంతరం లేని భూముల పరిష్కారం జీవో 30తో రెగ్యులైజెషన్ జరుగుతుందన్నారు.. సుపరిపాలన.. తొలి అడుగు కార్యక్రమంలోనే క్రమబద్దీకరణపై నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.. గత పరిపాలకులు చేసిన పొరబాట్ల కారణంగా భూముల యజమానుల ఎంట్రీస్ అలసత్వాలు జరిగాయి.. రెవెన్యూలో ఎవరైనా అధికారులు తప్పులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం.. మదనపల్లి ఘటన నుంచే అధికారులపై చర్యలు మొదలయ్యాయి.. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ లో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.
తాజావార్తలు
-
KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్కు చావోరేవో.. ప్లేఆఫ్స్కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
-
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!