KA Paul: ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి.. లేదంటే నేను రంగంలోకి దిగుతా..!
- చిత్తూరు జిల్లా కుప్పం మహిళా ఘటనపై స్పందించిన పాల్..
- మహిళను కొట్టిన వారిపై 302 కేసు పెట్టాలని డిమాండ్..
- ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపొతే నేను రంగంలోకి దిగుతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన కలకలం రేపుతోంది.. బాధితురాలికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు సీఎం చంద్రబాబు, బాధితురాలి పిల్లలు చదువుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు.. రూ.5లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.. అయితే, ఈ ఘటనపై స్పందించిన కేఏ పాల్.. నేను మహిళను కొట్టిన వారిపై 302 కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.. ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపొతే నేను రంగంలోకి దిగుతాను అని ప్రకటించారు.. సీఎం చంద్రబాబుకి ఒక ముఖ్య మైన లెటర్ రాశాను అన్నారు.. సీఎం చంద్రబాబు అసెంబ్లీ లో ఏడవడం చూసాం.. బయట కూడా చూసాం.. కూటమి ప్రభుత్వం వచ్చింది ఏడాది అయ్యింది.. ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ అమలు పర్చారు..? అని నిలదీశారు..
Read Also: Chhattisgarh: దారుణం.. ముగ్గురు గ్రామస్థులను గొంతు కోసి చంపిన నక్సల్స్..
Also Read
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
వైఎస్ జగన్ 5 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. వీళ్లు ఇంకో 5 లక్షల కోట్లు చేశారు.. కానీ, వీళ్లు సూపర్ సిక్స్ అమలు పరిచామని చెప్పుకుంటున్నారు.. ఇవన్నీ పవన్ కి తెలియ దు.. ఏదో డిప్యూటీ సీఎం ఇచ్చారు.. చేసుకుంటు వెళ్తున్నాడు అని వ్యాఖ్యానించారు పాల్.. ప్రత్యేక హోదా వల్ల ఏడాదికి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి.. 10 లక్షల ఆదాయం రాష్ట్రానికి వస్తుంది.. రేతులకు, నిరుద్యోగులు కు మహిళలకు, చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది.. మరీ ముఖ్యగా సూపర్ సిక్స్ అమలు పర్చాలంటే ఏడాదికి ఒక లక్ష 50 వేల కోట్లు కేంద్ర ఇస్తేనే అన్నారు.. నేను రాసిన లెటర్ కి జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా రిప్లై ఇవ్వలేదు అన్నారు… ప్రజలు జగన్ కి ప్రతి పక్ష హోదా ఇవ్వలేదు.. ప్రతి పక్ష నేనే కాబట్టి.. ప్రజల తరపున గొంతుగా ప్రశ్నిస్తానని వ్యాఖ్యానించారు.
Read Also: CM Chandrababu: కుప్పం బాధితురాలికి చంద్రబాబు ఫోన్.. ఆర్థికసాయం ప్రకటన.. నిందితులకు వార్నింగ్..
అయితే, ఒక అంశం లో సీఎం చంద్రబాబు ని అభినందిస్తున్నాను.. ఒక మహిళలను కట్టేసి దారుణంగా కొట్టారు.. తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు స్పందించారని పేర్కొన్నారు కేఏ పాల్.. కానీ, ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి.. ఇటువంటి వి మరో సారి జరగకుండా ఉండాలంటే అసెంబ్లీ లో బిల్ పెట్టాలి.. నేను మహిళను కొట్టిన వారిపై 302 కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.. ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపొతే నేను రంగంలోకి దిగుతానని ప్రకటించారు. అప్పులు ఇచ్చి రౌడీ ఇజానికి పాల్పడుతున్నారో అటువంటి వారిపై స్టాలిన్ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది.. అసెంబ్లీలో బిల్ పెడుతున్నారు.. అప్పులు ఇచ్చి మహిళలు కొట్టి వారి ఆడపిల్లలు ఎత్తుకెళ్లి అప్పులు వసూలు చేసుకుంటున్నారు.. అసలు ఇది ఎంత దారుణం…? అని ఆవేదన వ్యక్తం చేశారు.. అలా వసులు చేసే వారికి కఠిన చర్య లు తీసుకోవాలి.. 5 లక్షల జరిమానా.. 5 ఎళ్ల జైలు శిక్ష విధించాలి.. అటువంటి బిల్ అసెంబ్లీలో పెట్టాలని సీఎం చంద్రబాబుని కోరారు.. నేను రాసిన లెటర్ కి 7 రోజులు లోపు నాకు రిప్లై ఇవ్వాలి.. ప్రత్యేక హోదాపై హై కోర్ట్ లో కౌంటర్ ఫైల్ చెయ్యాలి… మనకు ప్రత్యేక హోదా కావాలి… మన బ్రతుకులు మారాలని వ్యాఖ్యానించారు కేఏ పాల్..
తాజావార్తలు
-
Samantha Pregnancy: ప్రతి దశ ఒకేలా ఉండదు.. బేబీ బంప్తో సమంత ఫోటోలు వైరల్!
-
Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన ‘షాపింగ్’ కింగ్..
-
AI Effect : AI దెబ్బకు ఉద్యోగాలే మాయం.. చైనాలో మొదలైన ఉపాధి సంక్షోభం.!
-
Elon Musk : నెలలోనే రూ.57 లక్షల కోట్ల ఆవిరి.. ఎలాన్ మస్క్కు భారీ దెబ్బ.!
-
Yuvraj Singh: యువరాజ్ ‘యువి’ పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?