Chhattisgarh: దారుణం.. ముగ్గురు గ్రామస్థులను గొంతు కోసి చంపిన నక్సల్స్..
- ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో దారుణం
- ముగ్గురు గ్రామస్థులను పంచిన నక్సలైట్లు
- తాళ్లతో గొంతు కోసి దారుణంగా హత్య
- ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నక్సలైట్లు ముగ్గురు గ్రామస్థులను చంపేశారు. పెద్దకోర్మ (నయాపర) గ్రామానికి చెందిన ముగ్గురు బాధితులను తాళ్లతో గొంతు కోసి దారుణంగా చంపారు. ఈ దాడి స్థానికుల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి నక్సలైట్లు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వామపక్ష తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడంలో భద్రతా దళాలు గణనీయమైన విజయాలు సాధిస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి దాడి జరగడం గమనార్హం.
READ MORE: Ahmedabad plane crash: DNA ద్వారా 163 మృతదేహాల గుర్తింపు.. 124 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత..!
Also Read
- India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
“మావోయిస్ట్ ఉద్యమం చివరి క్షణాల్లో ఉంది. వారి నాయకత్వం విచ్ఛిన్నమై, నిరాశకు గురైంది. దండకారణ్యం జోన్లో కేవలం 300 మంది సాయుధ కార్యకర్తలు మాత్రమే మిగిలి ఉన్నారు. వారు లొంగిపోవాలి లేదా నిర్ణయాత్మక యుద్ధానికి సిద్ధం కావాలి” అని బస్తర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పట్టిలింగం అన్నారు.
READ MORE: Allu Arjun : బన్నీ రిజెక్ట్ చేసిన రెండు భారీ మూవీలు..
ఈ నెల ప్రారంభంలో బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ను హతమార్చిన విషయం తెలిసిందే. ఇది ఆపరేషన్ కగార్లో పెద్ద పురోగతి. సుధాకర్పై ఇప్పటికే రూ. 40 లక్షల రివార్డు ప్రకటించారు. దట్టమైన అబుజ్మద్ అడవులలో సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబల కేశవ్ రావును చంపిన తర్వాత.. సుధాకర్ను సైతం మట్టుబెట్టారు. 1970 నాటి నుంచి మావోయిస్టు ఉద్యమంలో అనుభవజ్ఞుడైన కేశవ్రావుపై రూ. 1.5 కోట్ల బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
-
India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
-
Jason Sanjay: దళపతి ప్లేస్ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!