Chhattisgarh: దారుణం.. ముగ్గురు గ్రామస్థులను గొంతు కోసి చంపిన నక్సల్స్..
- ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో దారుణం
- ముగ్గురు గ్రామస్థులను పంచిన నక్సలైట్లు
- తాళ్లతో గొంతు కోసి దారుణంగా హత్య
- ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నక్సలైట్లు ముగ్గురు గ్రామస్థులను చంపేశారు. పెద్దకోర్మ (నయాపర) గ్రామానికి చెందిన ముగ్గురు బాధితులను తాళ్లతో గొంతు కోసి దారుణంగా చంపారు. ఈ దాడి స్థానికుల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి నక్సలైట్లు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వామపక్ష తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడంలో భద్రతా దళాలు గణనీయమైన విజయాలు సాధిస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి దాడి జరగడం గమనార్హం.
READ MORE: Ahmedabad plane crash: DNA ద్వారా 163 మృతదేహాల గుర్తింపు.. 124 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత..!
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
“మావోయిస్ట్ ఉద్యమం చివరి క్షణాల్లో ఉంది. వారి నాయకత్వం విచ్ఛిన్నమై, నిరాశకు గురైంది. దండకారణ్యం జోన్లో కేవలం 300 మంది సాయుధ కార్యకర్తలు మాత్రమే మిగిలి ఉన్నారు. వారు లొంగిపోవాలి లేదా నిర్ణయాత్మక యుద్ధానికి సిద్ధం కావాలి” అని బస్తర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పట్టిలింగం అన్నారు.
READ MORE: Allu Arjun : బన్నీ రిజెక్ట్ చేసిన రెండు భారీ మూవీలు..
ఈ నెల ప్రారంభంలో బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ను హతమార్చిన విషయం తెలిసిందే. ఇది ఆపరేషన్ కగార్లో పెద్ద పురోగతి. సుధాకర్పై ఇప్పటికే రూ. 40 లక్షల రివార్డు ప్రకటించారు. దట్టమైన అబుజ్మద్ అడవులలో సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబల కేశవ్ రావును చంపిన తర్వాత.. సుధాకర్ను సైతం మట్టుబెట్టారు. 1970 నాటి నుంచి మావోయిస్టు ఉద్యమంలో అనుభవజ్ఞుడైన కేశవ్రావుపై రూ. 1.5 కోట్ల బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..