Yuvraj Singh: యువరాజ్ ‘యువి’ పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ హైకోర్టు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు బిగ్ రిలీఫ్ ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటో, వాయిస్, వ్యక్తిత్వానికి సంబంధించిన గుర్తింపులను వ్యాపార పరంగా లేదా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించకుండా మూడో వ్యక్తులపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో భాగంగానే ఆయన పేరుతో వస్తువులను విక్రయించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రూపొందించే ‘డీప్ఫేక్’ కంటెంట్ను తయారు చేసి వ్యాప్తి చేయడంపై కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలతో నిషేధించింది. యువరాజ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జ్యోతి సింగ్ విచారణ జరిపారు.
యువరాజ్ సింగ్ మన దేశంలో అత్యంత గౌరవప్రదమైన, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెటర్లలో ఒకరని, ఆయన 17 ఏళ్ల పాటు అన్ని ఫార్మాట్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించారని కోర్టు పేర్కొంది. ఆయన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. ‘యువరాజ్ సింగ్’ లేదా ‘యువి’ అనే పేర్లు, ఆయన చిత్రం, వాయిస్, రూపాన్ని అనధికారికంగా వాడకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఏఐ సాయంతో ఆయనపై అనుచితమైన ఫోటోలు, వీడియోలు సృష్టిస్తూ, మతపరమైన భావాలను దెబ్బతీసేలా, ఇతర క్రికెటర్లతో గొడవపడుతున్నట్లు చూపించే కంటెంట్ను ప్రచారం చేస్తున్నారని యువరాజ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
ఈ తరహా ప్రచారం వల్ల యువరాజ్ ఎన్నో ఏళ్లుగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటున్నాయని భావించిన కోర్టు, మెటా వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లను సదరు వివాదాస్పద కంటెంట్ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. తన గుర్తింపు ద్వారా పొందే వ్యాపార ప్రయోజనాలపై యువరాజ్కు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయని వెల్లడించింది. గతంలో కూడా ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్, పవన్ కళ్యాణ్, క్రిటికల్ ప్లేయర్ అభిషేక్ శర్మ వంటి పలువురు ప్రముఖులు తమ పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఇలాంటి ఉపశమనాన్నే పొందారు.
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!