Cyclone Montha: ఏపీ తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
- తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తున్న మొంథా తుఫాన్..
- రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..
- ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు హెచ్చరికలు జారీ..
Cyclone Montha: మొంథా తుఫాన్ తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తోంది.. దీంతో, రెడ్ అలర్ట్ జారీ చేశారు.. ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మొంథా కొనసాగుతుండగా.. గత 6 గంటల్లో గంటకు 17 కిలో మీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది.. ప్రస్తుతం మచిలీపట్నంకి 190 కిలో మీటర్ల దూరంలో.. కాకినాడకు 270 కిలో మీటర్ల దూరంలో.. విశాఖపట్నంకు 340 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.. ఇక, గోపాలపూర్ (ఒడిశా) 550 కిలో మీటర్ల దూరంలో కొనసాగుతోంది.. తుఫాన్ ఈ సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం – కాళింగపట్నం మధ్యలో, కాకినాడ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది.. గాలి వేగం గంటకు 90–100 కిలో మీటర్లు.. అంత కంటే ఎక్కువగా గంటలకు 110 కిలో మీర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.. రాబోయే కొన్ని గంటల్లో ఏపీ తీర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతన్నారు..
Read Also: Bihar Election: నేడు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల.. ప్రధాన హామీ ఇదే!
Also Read
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
తుఫాను ప్రభావంతో కాకినాడలో రద్దీగా మారాయి కూరగాయల మార్కెట్లు, సూపర్ బజార్లు.. వారం రోజులకు సరిపడా కూరగాయలు, నిత్యవసర వస్తువులు స్టోర్ చేసుకుంటున్నామంటున్న పబ్లిక్.. సాయంత్రం తుఫాన్ తీరం దాటితే బయటికి వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో అని అప్రమత్తం అవుతున్నారు.. తుఫాను ప్రభావంతో మార్కెట్లకు రైతుల నుంచి కూరగాలు కూడా తక్కువ సంఖ్యలోనే వచ్చాయి.. అయితే, ఉన్న వాటినే కొనుక్కుని తీసుకుని వెళ్తున్నారు ప్రజలు.. మరోవైపు, బాపట్లలో మొంథా తుఫాను ప్రభావంతో రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది.. ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండగా.. అధికారులను అప్రమత్తం చేసింది జిల్లా యంత్రాంగం.. బాపట్ల లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు.. తీర ప్రాంతంలో ఎప్పటికప్పుడు గస్తీ కాస్తున్నారు పోలీసులు..
తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.. తీర ప్రాంత మండలాలపై ప్రభావం చూపుతోంది తుఫాన్.. గత రాత్రి నుంచి తీర ప్రాంత మండలాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.. అరగంట పాటు కురిసిన వర్షంతో నెల్లూరులోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన యంత్రాంగం.. జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా నమోదు అవ్వని భారీ వర్షాలు.. అత్యధికంగా 16.6 mm వర్షపాతం నమోదు అయ్యింది..
తాజావార్తలు
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!