Cyclone Montha: ఏపీ తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
- తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తున్న మొంథా తుఫాన్..
- రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..
- ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు హెచ్చరికలు జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Montha: మొంథా తుఫాన్ తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తోంది.. దీంతో, రెడ్ అలర్ట్ జారీ చేశారు.. ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మొంథా కొనసాగుతుండగా.. గత 6 గంటల్లో గంటకు 17 కిలో మీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది.. ప్రస్తుతం మచిలీపట్నంకి 190 కిలో మీటర్ల దూరంలో.. కాకినాడకు 270 కిలో మీటర్ల దూరంలో.. విశాఖపట్నంకు 340 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.. ఇక, గోపాలపూర్ (ఒడిశా) 550 కిలో మీటర్ల దూరంలో కొనసాగుతోంది.. తుఫాన్ ఈ సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం – కాళింగపట్నం మధ్యలో, కాకినాడ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది.. గాలి వేగం గంటకు 90–100 కిలో మీటర్లు.. అంత కంటే ఎక్కువగా గంటలకు 110 కిలో మీర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.. రాబోయే కొన్ని గంటల్లో ఏపీ తీర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతన్నారు..
Read Also: Bihar Election: నేడు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల.. ప్రధాన హామీ ఇదే!
Also Read
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
తుఫాను ప్రభావంతో కాకినాడలో రద్దీగా మారాయి కూరగాయల మార్కెట్లు, సూపర్ బజార్లు.. వారం రోజులకు సరిపడా కూరగాయలు, నిత్యవసర వస్తువులు స్టోర్ చేసుకుంటున్నామంటున్న పబ్లిక్.. సాయంత్రం తుఫాన్ తీరం దాటితే బయటికి వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో అని అప్రమత్తం అవుతున్నారు.. తుఫాను ప్రభావంతో మార్కెట్లకు రైతుల నుంచి కూరగాలు కూడా తక్కువ సంఖ్యలోనే వచ్చాయి.. అయితే, ఉన్న వాటినే కొనుక్కుని తీసుకుని వెళ్తున్నారు ప్రజలు.. మరోవైపు, బాపట్లలో మొంథా తుఫాను ప్రభావంతో రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది.. ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండగా.. అధికారులను అప్రమత్తం చేసింది జిల్లా యంత్రాంగం.. బాపట్ల లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు.. తీర ప్రాంతంలో ఎప్పటికప్పుడు గస్తీ కాస్తున్నారు పోలీసులు..
తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.. తీర ప్రాంత మండలాలపై ప్రభావం చూపుతోంది తుఫాన్.. గత రాత్రి నుంచి తీర ప్రాంత మండలాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.. అరగంట పాటు కురిసిన వర్షంతో నెల్లూరులోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన యంత్రాంగం.. జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా నమోదు అవ్వని భారీ వర్షాలు.. అత్యధికంగా 16.6 mm వర్షపాతం నమోదు అయ్యింది..
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!