Bihar Election: నేడు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల.. ప్రధాన హామీ ఇదే!
- బీహార్లో కొనసాగుతున్న ఎన్నికల సమరం
- నేడు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల
- ప్రధాన హామీ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఇక వారం రోజులే మిగిలుంది. ఇంకోవైపు రాష్ట్రంలో ఛత్ పండుగ సందడి సాగుతోంది. రాష్ట్రమంతా కోలాహలంగా ఉంది. ఈరోజుతో ఛత్ పండుగ ముగియనుంది. ఇక ఓట్ల పండుగ ప్రారంభం కానుంది. బీహారీయులు తిరిగి పనుల నిమిత్తం బయట రాష్ట్రాలకు వెళ్లిపోకుండా పార్టీలు పక్కా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అన్ని పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన.. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడి
Also Read
ఇదిలా ఉంటే మంగళవారం మహాఘటబంధన్ మేనిఫెస్టో విడుదల కానుంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాట్నాలో మేనిఫెస్టో విడుదల చేసి అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీహార్ అంతటా ర్యాలీలు, బహిరంగ సమావేశాలను ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Cyclone Montha: 10 జిల్లాలపై మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు..
ఇక మేనిఫెస్టోలో ప్రధానంగా ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అనే హామీ ఉండొచ్చని తెలుస్తోంది. ఇటీవలే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యమేనని తెలిపారు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో ఈ హామీ ఉండొచ్చని సమాచారం. అలాగే వృద్ధాప్య పింఛన్ను కూడా పెంచొచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా జీవికా దీదీలను పర్మినెంట్ చేసి రూ.30,000 జీతం ఇవ్వనున్నారు. యువత, మహిళలను ఆకట్టుకునేలా హామీల వర్షం కురిపించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది.
ఇదిలా ఉంటే ఎన్నికల వేళ ఆర్జేడీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న 27 మంది నాయకులను ఆర్జేడీ బహిష్కరించింది. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!