Cyclone Montha: పెను తుఫాన్గా మారిన మొంథా..
- పెను తుఫాన్గా మారిపోయిన మొంథా తుఫాన్..
- ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- గత 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర–వాయువ్య దిశగా పయనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Montha: మొంథా తుఫాన్ క్రమంగా తీవ్ర రూపం దాల్చుతూ తీరం వైపు దూసుకొస్తుంది.. పెను తుఫాన్గా మారిపోయింది మొంథా తుఫాన్.. దీంతో, ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మొంథా పెను తుఫాన్గా మారిపో్యింది.. గత 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో ఉత్తర–వాయువ్య దిశగా కదులుతోంది.. తుఫాన్ ప్రస్తుతం.. మచిలీపట్నంకి దక్షిణ–ఆగ్నేయంగా 160 కిలో మీటర్ల దూరంలో.. కాకినాడకి దక్షిణ–ఆగ్నేయంగా 240 కిలో మీటర్ల దూరంలో.. విశాఖపట్నంకి దక్షిణ–దక్షిణ పశ్చిమంగా 320 కిలో మీటర్ల దూరంలో కేంద్రీ కృతమైంది.. ఇక, గోపాల్పూర్ (ఒడిశా) కి దక్షిణ–దక్షిణ పశ్చిమంగా 530 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది మొంథా పెను తుఫాన్.. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడ పరిసర ప్రాంతాల్లో మొంథా తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది.. తీర దాటే సమయానికి గాలివేగం గంటకు 90–100 కిలో మీటర్ల నుంచి గరిష్టంగా 110 కిలో మీటర్ల వరకు వీస్తుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు..
Read Also: Sandhya Mridul: ఫాలోవర్స్ లేని నటీనటులకి ఇండస్ట్రీలో పనిలేదు..
Also Read
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
- CM Chandrababu: విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా.. సంక్షేమం – అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ఇక, ఇప్పటికే విశాఖపట్నం సహా తీర ప్రాంతంలోని జిల్లాలపై మొంథా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. దీంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.. మరోవైపు కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు అధికారులు.. కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9 జారీ చేశారు.. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుకు 8వ నంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి.. మరోవైపు, విశాఖపట్నంలో కుండపోత వర్షం కురుస్తుండడంతో.. విశాఖలో అన్ని విమానాలు రద్దు చేశారు అధికారులు.. 36 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించారు.. ఇంకోవైపు.. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు.. తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దు చేశారు.. కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు కాగా.. ఈస్ట్ కోస్ట్ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్ రైళ్లు రద్దు అయ్యాయి.. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు.. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు.. నేడు, రేపు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు..
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!