AP Capital: అమరావతి పునర్నిర్మాణం.. నేడు సీఎం చంద్రబాబు శ్రీకారం..
- అమరావతి పునర్నిర్మాణానికి సిద్ధమైన ప్రభుత్వం..
- సీఆర్దీయే ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభం..
- ఈ రోజు పనులను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం.. గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టినా.. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అవి ముందుకు సాగలేదు.. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి సిద్ధమైంది.. ఆ పనులకు నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు.. ఏపీ సీఆర్దీయే ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని పనులను మొదలు పెట్టనుంది ప్రభుత్వం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆ పనులను ప్రారంభించనున్నారు చంద్రబాబు.. అయితే, 160 కోట్ల రూపాయలతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టింది సీఆర్డీఏ.. కానీ, ఆ తర్వాత ఆ పనులు నిలిచిపోయాయి.. ఇక, ఈ నెల 16 తేదీన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు.. అందులో భాగంగా నేడు.. పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు..
Read Also: Cyberabad CP: పటాకుల దుకాణం కోసం దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే..
Also Read
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలు.. అప్పటికే పూర్తి అయిన భవనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించిన విషయం విదితమే.. ఇక, ఆ నిర్మాణాలు పటిష్టంగా ఉన్నాయా? లేక దెబ్బతిన్నాయా? అనే అంశంపై కూడా అధ్యయనం చేయించి.. నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక, అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!