CM Chandrababu: జీబీఎస్పై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
- జీబీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం..
- జీబీఎస్ కేస్ లు వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చ..
- ఈ వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. నిన్నటికి నిన్న గుంటూరు జీజీహెచ్ లో ఓ వృద్ధురాలు జీబీఎస్ వ్యాధి లక్షణాలతో మృతి చెందడం కలకలం రేగింది.. అయితే, అధికారుల లెక్కల ప్రకారంలో ఏపీలో 17 జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి.. అనధికారంగా ఈ సంఖ్యలో ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది.. ఈ నేపథ్యంలో.. అలర్ట్ అయిన ఏపీ ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీస్తోంది.. మరోవైపు.. ఈ రోజు జీబీఎస్ పై సమీక్ష సమావేశం నిర్వమించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీబీఎస్ కేస్ లు వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించారు.. ఈ వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు.. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు.. ఇంజక్షన్ కూడా అందుబాటులో ఉంచాలని.. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశంలో మంత్రి సత్య కుమార్ యాదవ్, సీనియర్ ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Also: NTPC Recruitment 2025: కేంద్ర విద్యుత్ సంస్థలో భారీగా జాబ్స్.. నెలకు రూ.55 వేల జీతం
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
కాగా, గులియన్-బారే సిండ్రోమ్ అనేది చాలా అరుదైన వ్యాధిగా చెబుతున్నారు వైద్యులు.. ఈ వ్యాధిలో రోగనిరోధక వ్యవస్థ నాడీ వ్యవస్థపై దాడి చేస్తుందని… బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ లేదా కొన్నిసార్లు టీకా వికటించి ఈ పరిస్థితికి దారితీస్తుందన్నారు.. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దాని పరిధిలోని నరాలపై ఎటాక్ చేస్తుంది. ఈ పరిస్థితి బలహీనత, తిమ్మిరి, అవయవాలలో పక్షవాతం వంటి లక్షణాలకు దారితీస్తుందని చెబుతున్నారు.. అయితే, ఇది సాధారణంగా ఫ్లూ లేదా కడుపు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ తో మొదలవుతుంది. క్రమంగా తీవ్రమవుతుంది. క్రమంగా రోగి కదిలే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!