CM Chandrababu: జీబీఎస్పై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
- జీబీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం..
- జీబీఎస్ కేస్ లు వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చ..
- ఈ వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. నిన్నటికి నిన్న గుంటూరు జీజీహెచ్ లో ఓ వృద్ధురాలు జీబీఎస్ వ్యాధి లక్షణాలతో మృతి చెందడం కలకలం రేగింది.. అయితే, అధికారుల లెక్కల ప్రకారంలో ఏపీలో 17 జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి.. అనధికారంగా ఈ సంఖ్యలో ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది.. ఈ నేపథ్యంలో.. అలర్ట్ అయిన ఏపీ ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీస్తోంది.. మరోవైపు.. ఈ రోజు జీబీఎస్ పై సమీక్ష సమావేశం నిర్వమించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీబీఎస్ కేస్ లు వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించారు.. ఈ వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు.. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు.. ఇంజక్షన్ కూడా అందుబాటులో ఉంచాలని.. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశంలో మంత్రి సత్య కుమార్ యాదవ్, సీనియర్ ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Also: NTPC Recruitment 2025: కేంద్ర విద్యుత్ సంస్థలో భారీగా జాబ్స్.. నెలకు రూ.55 వేల జీతం
Also Read
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
కాగా, గులియన్-బారే సిండ్రోమ్ అనేది చాలా అరుదైన వ్యాధిగా చెబుతున్నారు వైద్యులు.. ఈ వ్యాధిలో రోగనిరోధక వ్యవస్థ నాడీ వ్యవస్థపై దాడి చేస్తుందని… బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ లేదా కొన్నిసార్లు టీకా వికటించి ఈ పరిస్థితికి దారితీస్తుందన్నారు.. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దాని పరిధిలోని నరాలపై ఎటాక్ చేస్తుంది. ఈ పరిస్థితి బలహీనత, తిమ్మిరి, అవయవాలలో పక్షవాతం వంటి లక్షణాలకు దారితీస్తుందని చెబుతున్నారు.. అయితే, ఇది సాధారణంగా ఫ్లూ లేదా కడుపు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ తో మొదలవుతుంది. క్రమంగా తీవ్రమవుతుంది. క్రమంగా రోగి కదిలే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
West Bengal elections: బెంగాల్లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
-
DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?
-
Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
-
Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!