CM Chandrababu: ఐటీని ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యాను.. అప్పుడు మైక్రోసాఫ్ట్- ఇప్పుడు గూగుల్!
- టెక్ విద్యార్థులతో సీఎం చంద్రబాబు క్వాంటం టాక్..
- రాష్ట్రంలో ఐటీని ప్రమోట్ చేయడంలో సక్సె్స్ అయ్యాను..
- అప్పుడు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు గూగుల్ ను తీసుకొచ్చా: సీఎం చంద్రబాబు
CM Chandrababu: విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి క్వాంటం ప్రోగ్రాం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే 50 వేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లలో 51 శాతానికి పైగా మహిళా టెక్ విద్యార్థులు ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా ఈరోజు ( డిసెంబర్ 23న) ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్ విద్యార్థులతో క్వాంటం టాక్ నిర్వహించారు. క్వాంటం టెక్నాలజీ ప్రాధాన్యతపై ప్రధానంగా చర్చించారు.
Also Read
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
- CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
- AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
- Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐటీని ప్రమోట్ చేయడంలో తాను సక్సె్స్ అయినట్లు తెలిపారు. 1998లో మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు రప్పించాం.. ఇప్పుడు (2025) విశాఖకు గూగుల్ సంస్థను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గూగుల్ 15 బిలయన్ డాలర్ల పెట్టుబడులను వైజాగ్ లో పెట్టనుందన్నారు. ఇక, ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం.. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు ఇస్తామన్నారు. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యురేటివ్ హెల్త్ను క్వాంటం అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది.. సామర్ధ్యాలు, వేగం, కచ్చితత్వం లాంటివి క్వాంటం టెక్నాలజీ ద్వారా సాధించే అవకాశం ఉంటుందని చంద్రబాబు అన్నారు.
Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు..?
ఇక, ఓ ట్రాన్సఫర్మేషనల్ ఛేంజ్ క్వాంటం ద్వారా సాధించేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను భారతీయులు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.. ఏ సాంకేతికత అయినా విప్లవమైనా ఏపీ సారథ్యం వహిస్తుంది.. ఎవరినీ అనుసరించదని అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి చేస్తున్నాం.. క్వాంటం నిపుణులు, క్వాంటం కంప్యూటర్లు, పరికరాలను ఏపీ నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తామని చెప్పారు. నవంబర్ 13వ తేదీన ఇచ్చిన క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది.. క్వాంటం నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన ఒక్క ప్రకటన ద్వారా 54 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?