Biryani Tax Scam: హైదరాబాద్ బిర్యానీ హోటళ్లలో భారీ స్కాం.. ఏకంగా రూ. 70 వేల కోట్లు..!
- ఏఐతో బయటపడిన రూ. 70 వేల కోట్ల పన్ను కుంభకోణం
- 60 టెరాబైట్ల డేటా విశ్లేషణలో వెలుగుచూసిన అవకతవకలు
- దేశవ్యాప్తంగా దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీడీటీ
Hyderabad Biryani Tax Scam : భాగ్యనగరంలోని ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లు కేంద్రంగా సాగుతున్న కళ్లు చెదిరే పన్ను ఎగవేత భాగోతాన్ని ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు బట్టబయలు చేశారు. కేవలం హైదరాబాద్లోని కొన్ని హోటళ్లలో మొదలైన సాధారణ తనిఖీలు, ఏకంగా దేశవ్యాప్త పన్ను కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చాయి. అత్యాధునిక సాంకేతికతను వాడుకుని సుమారు రూ. 70,000 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ భారీ స్కామ్ను ఛేదించడానికి ఐటీ అధికారులు మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , బిగ్ డేటా అనలిటిక్స్ను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్లు ఉపయోగిస్తున్న ఒక ప్రముఖ బిల్లింగ్ సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన 60 టెరాబైట్ల (TB) డేటాను అధికారులు విశ్లేషించారు. ఇందులో సుమారు 1.77 లక్షల రెస్టారెంట్ ఐడీల లావాదేవీలను ఏఐ సాధనాల ద్వారా స్కాన్ చేయగా, గడచిన ఆరు ఆర్థిక సంవత్సరాల్లో (2019-20 నుండి 2025-26 వరకు) జరిగిన భారీ అవకతవకలు బయటపడ్డాయి. కస్టమర్లు చెల్లించిన బిల్లులను సాఫ్ట్వేర్ నుండి నేరుగా ‘డిలీట్’ చేయడం లేదా మార్చడం ద్వారా హోటల్ నిర్వాహకులు ఆదాయాన్ని తక్కువగా చూపిస్తున్నట్లు వెల్లడైంది.
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
Team Rankings: సూపర్-8 టీమ్ ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో జింబాబ్వే, భారత్ స్థానం ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లోని హోటళ్లు ఈ అక్రమాల్లో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 5,141 కోట్ల విలువైన అమ్మకాలను లెక్కల్లో చూపకుండా దాచిపెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్లోని పిస్తా హౌస్, షాగౌస్, మెహఫిల్ వంటి ప్రముఖ బిర్యానీ చైన్ల వద్ద జరిగిన తనిఖీల్లో కీలక ఆధారాలు లభించాయి. ఒక్క తెలంగాణలోనే సుమారు రూ. 1,500 కోట్ల విలువైన బిల్లులను సిస్టమ్ నుండి తొలగించినట్లు అధికారులు గుర్తించారు. సగటున ఒక హోటల్ తన వాస్తవ అమ్మకాలను 27% వరకు తగ్గించి చూపిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నట్లు అంచనా.
హోటల్ నిర్వాహకులు ప్రధానంగా నగదు (Cash) రూపంలో జరిగే లావాదేవీలను లక్ష్యంగా చేసుకున్నారు. కస్టమర్ల నుండి నగదు తీసుకుని బిల్లు ఇచ్చిన తర్వాత, ఆ రికార్డులను సాఫ్ట్వేర్ నుండి పూర్తిగా తొలగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి, నెలల తరబడి జరిగిన అమ్మకాల రికార్డులను కూడా ‘బల్క్ డిలీట్’ ఆప్షన్ ద్వారా మాయం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రూ. 2,784 బిల్లును కేవలం రూ. 27గా మార్చిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలా దేశవ్యాప్తంగా సుమారు రూ. 13,317 కోట్ల విలువైన బిల్లులను నేరుగా డిలీట్ చేయగా, మొత్తం మీద లెక్కల్లో చూపని టర్నోవర్ రూ. 70,000 కోట్లకు చేరుకుంది.
కర్ణాటక ఈ పన్ను ఎగవేతలో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ విచారణను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) దేశవ్యాప్తం చేసింది. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతూ సాగుతున్న ఈ ‘బిర్యానీ స్కాం’పై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?