CM Chandrababu: టీడీపీ మంత్రులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ..
- నేడు సాయంత్రం టీడీపీ మంత్రులు, ఎంపీలతో చంద్రబాబు భేటీ..
- నామినేటెడ్ పదవులు.. టీడీపీ సభ్యత్వ నమోదుపై చర్చ..
- కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచన..
- మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే దిశగా కార్యాచరణ..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బిజీబిజీగా గడపనున్నారు.. ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్న ఆయన.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం టీడీపీ మంత్రులతో ప్రత్యేకంగా భేటీకానున్నారు.. నామినేటెడ్ పదవులు.. టీడీపీ సభ్యత్వానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.. ఇక, ఎంపీలు, జోనల్ ఇంఛార్జీలతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని.. కొన్ని శాఖలకు సంబంధించి ఎంపీలు దృష్టి పెట్టాలని ఇప్పటికే సూచించారు సీఎం చంద్రబాబు.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే దిశగా ఇవాళ సమావేశంలో కార్యాచరణ సిద్ధం చేయనున్నట్టుగా తెలుస్తోంది.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లే విధంగా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Ajith Kumar : సంక్రాంతికి వాయిదా పడిన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
కాగా, సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ సమావేశం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలు మరియు ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలనేది ఒక ముఖ్యమైన ఎజెండా అంశం. అదనంగా, విస్తృత సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను మంత్రివర్గం చర్చించవచ్చు. ఎజెండాలోని ఇతర ముఖ్య అంశాలు బహుళ కంపెనీలకు భూమి కేటాయింపు, ఇది ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సూచిస్తుంది. మద్యం దుకాణాలలో గీత కార్మికులకు 10 శాతం కేటాయింపు అనే వివాదాస్పద అంశంపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.. ఇక, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లేవనెత్తిన అభ్యంతరాలను కూడా ఈ సమావేశంలో పరిశీలిస్తారు, దీనివల్ల అంతర్-రాష్ట్ర సంబంధాలు మరియు జల వనరుల నిర్వహణ చర్చనీయాంశంగా మారనుంది.. కేబినెట్ సమావేశం తర్వాత, ముఖ్యమంత్రి తాజా రాజకీయ పరిణామాలు మరియు అదనపు ముఖ్యమైన అంశాలపై మంత్రులతో చర్చించి, ఆంధ్రప్రదేశ్లో పాలన మరియు ప్రజా సంక్షేమానికి సమగ్ర విధానాన్ని నిర్ధేశించనున్నారు.
తాజావార్తలు
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
Ashu Reddy: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది.. బాదితుడి సంచలనం!
ట్రెండింగ్
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!