CM Chandrababu: ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. వారితో అప్రమత్తంగా ఉండాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు, గ్రామస్థాయి కార్యకర్తలతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం వంటి పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 29న ఘనంగా నిర్వహించామని, పార్టీకి సేవలందించిన సీనియర్ కార్యకర్తలను సత్కరించామని తెలిపారు. రాజకీయ సాధికారతను పెంపొందిస్తూ, జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు పదవులు కేటాయించి సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తాను ప్రతి పర్యటనలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ మార్గదర్శకత్వం అందిస్తున్నానని చెప్పారు.
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
ప్రతి నెల మొదటి తేదీన “పేదల సేవలో” కార్యక్రమం ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు చంద్రబాబు. అమరావతిని రాజధానిగా కేంద్రం చట్టబద్ధం చేయనున్న నేపథ్యంలో, ఈ విషయాన్ని గర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గత పాలకులు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురి చేశారని విమర్శించారు. రాజధాని అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో ప్రస్తుతం మంచి అవకాశాలు ఉన్నాయని, అమరావతి నిర్మాణం రైతులు ఇచ్చిన భూములతోనే జరుగుతోందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని నాయకులకు సూచించారు.
ప్రభుత్వ పథకాలపై మాట్లాడుతూ, పీ4 పథకం కింద 10 లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని, ఏడాదిలోనే 2 లక్షల కుటుంబాల్లో మార్పు తీసుకురాగలిగామని తెలిపారు చంద్రబాబు… ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, బకాయిలను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించామని, 22 నెలల్లో 5.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. టిడ్కో ఇళ్ల కోసం అడ్వాన్స్ చెల్లించిన వారికి రూ.174 కోట్లను తిరిగి చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని, నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశామని తెలిపారు. అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.
రాయలసీమ అభివృద్ధి, నీటి ప్రాజెక్టులపై కూడా వివరించారు చంద్రబాబు. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందిస్తున్నామని, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధికి పూర్వోదయ పథకం దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల పట్ల ప్రజాప్రతినిధులు సత్ప్రవర్తనతో ఉండాలని, వారిని ఆప్యాయంగా కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. అలాగే నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, నీతిమాలిన చర్యలకు పాల్పడేవారిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ప్రతి స్థాయిలో ఖండించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!