AP Panchayat Raj Wins National Awards 2026: ఏపీ పంచాయతీరాజ్ శాఖకు జాతీయ అవార్డులు.. పవన్ కల్యాణ్ హర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Raj Wins National Awards 2026: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. వరుసగా రెండో ఏడాది దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు.. ఈ విజయాలు గ్రామీణాభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించిన పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసం పాలెం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం విశేషమని పవన్ అన్నారు. అదేవిధంగా సుపరిపాలన విభాగంలో విశాఖపట్నం జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమని తెలిపారు.
గ్రామ స్థాయిలో పేదరిక నిర్మూలన, జీవనోపాధి మెరుగుదల అంశాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా చెమ్ముళ్లపల్లి గ్రామం జాతీయ స్థాయిలో రెండో స్థానం సాధించగా, మౌలిక సదుపాయాల కల్పనలో స్వయం సమృద్ధి సాధించిన పంచాయతీల్లో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీ మూడో స్థానంలో నిలిచింది. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం మండలం జాతీయ స్థాయిలో మూడో అత్యుత్తమ మండలంగా ఎంపిక కావడం ప్రత్యేకంగా నిలిచింది. గత ఏడాది కూడా పంచాయతీరాజ్ శాఖ వివిధ విభాగాల్లో నాలుగు అవార్డులు గెలుచుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
ఈ విజయాలకు కారణమైన గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు అందరికీ పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గ్రామీణాభివృద్ధికి తమ కృషిని గుర్తించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అవార్డులు తమపై మరింత బాధ్యతను మోపాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాది దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహిళలకు స్నేహపూర్వక వాతావరణంగల పంచాయతీగా తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండల పరిధిలోని బొక్కసం పాలెం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం… pic.twitter.com/sKlL689MZQ
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 31, 2026
తాజావార్తలు
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
-
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!