CM Chandrababu: కేబినెట్ తర్వాత మంత్రులతో విడిగా సీఎం భేటీ.. ఎప్పుడూ చూడలేదు.. ఇదో కొత్త ట్రెండ్..!
- కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం కీలక చర్చలు..
- బియ్యం, భూ దురాక్రమణ మాఫీయా ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది..
- కాకినాడ పోర్ట్ ను బలవంతంగా లాక్కొనారు..
- కాకినాడ సెజ్ కూడా లాగేసుకున్నారు..
- ఆస్తులను లాగసుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్..
- ఇంతకు ముందు మనం ఎప్పుడూ చూడలేదన్న సీఎం చంద్రబాబు..
CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. ఈ సమావేశంలో 10 అంశాలపై కీలకంగా చర్చించారు. పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు గంటల పాటు ఈ సమావేశం సాగింది. జలజీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ డీపీఆర్ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారులను ప్రశ్నించారు సీఎం… ప్రతీ ఒక్కరికీ తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ చెబుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. బ్యూరోక్రసీ ఆలస్యం కావడం వల్లే మంచి పథకం సద్వినియోగం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.
Read Also: Amaravati Capital: రాజధాని అమరావతి నిర్మాణానికి భారీ విరాళం
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
మరోవైపు.. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం వివిధ అంశాలపై మంత్రులతో చర్చించారు.. బియ్యం, భూ దురాక్రమణ మాఫీయా ప్రభుత్వానికి సవాల్ విసురుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. అన్నింటినీ అరికాడతామని స్పష్టం చేశారు.. కాకినాడ పోర్ట్ ను బలవంతంగా లాక్కొనారు.. కాకినాడ సెజ్ కూడా లాగేసుకున్నారు.. పోర్ట్ లాగేసుకుని 41 శాతం కేవీ రావుకు ఇచ్చేసి 59 శాతం అరబిందో వాళ్లు లాక్కొన్నారని ఆరోపించారు.. ఆస్తులను లాగసుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్… ఇంతకు ముందు మనం ఎప్పుడూ చూడలేదన్నారు సీఎం.. వ్యవస్థలను బాగా డ్యామేజ్ చేశారు.. ఐవీఆర్ఎస్ అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నాం.. పథకాలు మీద అభిప్రాయ సేకరణ చేయిస్తున్నాం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!