Andhra Pradesh: 5 విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభం.. 14 సబ్ స్టేషన్లకు సీఎం శంకుస్థాపన
- అమరావతికి విద్యుత్ సరఫరా కోసం గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్..
- రాష్ట్రవ్యాప్తంగా ఐదు సబ్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- 14 సబ్ స్టేషన్లకు సీఎం శంకుస్థాపన..
Andhra Pradesh: రాజధాని అమరావతి ప్రాంతానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. అందులో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లా తాళ్లాయిపాలెంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రూ.505 కోట్లతో నిర్మించిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ను ప్రారంభించిన సీఎం.. అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరాకు 400/220కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ (జీఐఎస్)ను నిర్మించింది ప్రభుత్వం.. ఇక, తాళ్లాయపాలెంలో విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించిన తర్వాత సబ్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.. మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు.. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 5 విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభోత్సవాలు,14 సబ్ స్టేషన్లకు శంకుస్థాపనలు చేశారు సీఎం చంద్రబాబు. రాజధాని గ్రామం తాళ్లాయపాలెం లో సబ్ స్టేషన్ ప్రారంభించిన ఆయన.. వర్చువల్ గా మిగిలిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.. అమరావతిలో భవిష్యత్తులో నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా తాళ్లాయపాలెం లో రాష్ట్రంలోనే మొదటి GIS విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి.. రాజధానిలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా విద్యుత్ సరఫరా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారో మంత్రి నారాయణను అడిగి తెలుసుకున్నారు.. ఇక, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలతోపాటు పరిశ్రమలకూ అంతరాయం లేని విద్యుత్తు సరఫరాకు జీఐఎస్ తోడ్పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.. తాళ్లాయపాలెం జీఐఎస్ కేంద్రం నుంచి రాజధాని అమరావతిలో నిర్మించబోయే 220/33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాలకు సరఫరా చేయనున్నారు..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!