Chandrababu and Pawan Kalyan: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..!
- ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..
- ఉదయం 10.40 నుంచి 12 గంటల వరకు భేటీ..
- హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ఉండవల్లి రానున్న పవన్..
- ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయం లో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు… తాజా రాజకీయ పరిణామంతో పాటు తిరుపతి లడ్డూ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు రాజ్యసభ స్థానాల అంశానికి సంబంధించి కూడా చర్చకు రానున్నట్టు సమాచారం.. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం 10.40కి సమావేశం కానున్నారు. హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం అమరావతికి రానున్నారు.. ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా నిన్న కేబినెట్లో చర్చించిన తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి సిట్ నివేదిక.. అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనుంది.
Read Also: Telangana BJP: బీజేపీకి జనసేన సపోర్ట్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్..
Also Read
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
- YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. 'పితృసమాన నేతను కోల్పోయాం'
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
రాష్ట్రంలో తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి గత నాలుగు రోజులుగా… వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా ఉన్నాయి.. ఈ విషయాలు అన్నింటి మీద కూడా చర్చ జరగనుంది. దీంతోపాటు కూటమి నేతలు మంత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా ప్రధానంగా చర్చిస్తారు.. టీటీడీ తిరుమల తిరుపతి లడ్డూ అంశానికి సంబంధించి ప్రధానంగా టీడీపీ ఒక్కటే ఇప్పటి వరకు ప్రత్యక్ష ఆందోళనలో ఉంది.. దీంతోపాటు కూటమి మొత్తం కలిసి వస్తే గనుక తీవ్రత కొంచెం పెంచినట్టు అవుతుందని నిన్న సీఎంతో జరిగిన సమావేశంలో చర్చకి వచ్చింది.. ఆ దిశగా చర్చ జరగనుంది. మూడు పార్టీలు కలిసి అందులో ప్రధానంగా జనసేన కూడా ఉంది కాబట్టి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లే విధంగా సీఎం.. డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది…
దీంతోపాటు త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ప్రత్యేకించి చర్చించే అవకాశం ఉంది.. కూటమిలో నాలుగు స్థానాలు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.. కాబట్టి కూటమిలో టీడీపీకి రెండు, జనసేనకి ఒకటి, బీజేపీకి ఒకటి వచ్చే అవకాశం ఉంది.. కాబట్టి ఆ దిశగా కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది… దీంతోపాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఇతర అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చిస్తారు… త్వరలో మంత్రి మండలి విస్తరణ జరగచ్చని సమాచారం.. ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అంబటి రాంబాబు నివాసంలో. జరిగిన దాడికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన చేస్తూ ఉన్నారు. దీంతో గుంటూరు జగన్మోహన్ రెడ్డి పర్యటన విషయానికి సంబంధించి కూడా ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చకి వచ్చే అవకాశం ఉంది… అవసరం అయితే జిల్లా పర్యటనలు పవన్ చేసే విధంగా కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.. అంటే రాబోయే రోజుల్లో జగన్ తీసుకునే స్టాండ్ ఎలా ఉండనుంది.. అవసరమైతే పవన్ కల్యాణ్ కూడా జిల్లా పర్యటన చేయాలా లేకపోతే ఉమ్మడిగా కూటమి… పోరాటాలు.. చెయ్యాలా అనే అంశం పై… ప్రధానంగా చర్చకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఓవరాల్ గా నిన్న కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొంతమంది మంత్రులు కలిసి మాట్లాడుకున్నారు… ఇవాళ జరిగే సమావేశం కూడా కీలకంగా మారింది ..
తాజావార్తలు
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!