CM Chandrababu: వ్యవసాయశాఖ అధికారులకు సీఎం కీలక ఆదేశాలు.. రైతులకు గుడ్ న్యూస్..
- రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు..
- సాగవుతున్న ప్రాంతాన్ని వంద శాతం ఈ క్రాపింగ్ కింద నమోదు చేయాలన్న సీఎం..
- జులై నెలలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు 36 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ..
- రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు..
CM Chandrababu: రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో సాగవుతున్న ప్రాంతాన్ని వంద శాతం ఈ క్రాపింగ్ కింద నమోదు చేయాలని స్పష్టం చేశారు.. జులై నెలలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు 36 కోట్ల ఇన్ పుట్ సబ్సీడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని ఆదేశించిన సీఎం… దీంతో సంబంధిత రైతులకు గుడ్ న్యూస్ చెప్పినట్టు అయ్యింది.. ఇక, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని క్లారిటీ ఇచ్చారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 140 డ్రోన్లు మాత్రమే వినియోగిస్తున్నామని వెల్లడించారు అధికారులు. ఇక, కరవు ప్రాంతాల్లో మాయిశ్చర్ ను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పరిశీలన చేసి చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఉద్యాన పంటల ఉత్పత్తి పెరిగేలా చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు.
Read Also: Asaduddin Owaisi: ముస్లింలను అంతం చేయడమే వక్ఫ్ బిల్లు లక్ష్యం..
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
ఇక, మైక్రో ఇరిగేషన్ మాన్యుఫాక్చరింగ్ పార్కు ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. నిమ్మ, టమాటా, మామిడి వంటి ఉత్పత్తుల విలువ జోడించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలన్న సీఎం. ఈ ఉత్పత్తుల ఎగుమతులకు ఎయిర్ కార్గో సేవల్ని అందించేలానూ చూడాలని స్పష్టం చేశారు.. త్వరలోనే ప్రారంభించనున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలుపై కొన్ని సూచనలు చేశారు.. లబ్ధిదారులను గుర్తించేందుకు మొబైల్ నెంబర్లు- బ్యాంకు ఖాతాలను అనుసంధానానికి ఆదేశించారు.. ఈ మేరకు జియో ట్యాగ్ చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
-
US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
-
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!